Bandh in entire telangana

Bandh in entire Telangana, Bandh protesting Polavaram ordinance, President issues ordinance on Polavaram project

Bandh in entire Telangana

తెలంగాణాలో బంద్!

Posted: 05/29/2014 08:32 AM IST
Bandh in entire telangana

రాష్ట్రపతి పోలవరానికి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చెయ్యటంతో తెలంగాణాకు కాబోయే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ముందుగా హెచ్చరించినట్లుగానే తెలంగాణా వ్యాప్తంగా ఆందోళన సాగుతోంది.  బస్సు డిపోల ముందు నాయకులు కూర్చుని ధర్నా చేస్తున్నారు.  హైద్రాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ లో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోవటంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.  హైద్రాబాద్ సిటీ బస్సులు కూడా నిలిచిపోయాయి.  

సంగారెడ్డి బస్ డిపో ఎదురుకగా బైఠాయించిన సంగారెడ్డి ఎమ్మల్యే పోలవరం డిజైన్ మార్పును డిమాండ్ చేస్తున్నారు.  మహబూబ్ నగర్, ఖమ్మంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది.  వందలాది బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వికారాబాదం, నిజామాబాద్, జుబ్లీ బస్ స్టేషన్ల నుంచి కూడా ఆందోళన చేపట్టినట్లుగా సమాచారం.  ఇంతవరకు బంద్ ప్రశాంతంగా సాగుతోంది.  ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనా చోటుచేసుకోలేదు.

విభజన జరగగానే అంతా అయిపోలేదు, పంచాయితీ తెగినట్లు కాదని, ఇంకా ఎంతో పోరాటం చెయ్యవలసివుందని ఎన్నికల ముందు కెసిఆర్ అన్నట్లుగానే తెలంగాణా హక్కుల కోసం ఉద్యమం ఇంకా కొనసాగుతూనే వుంది.  పోలవరం ముంపు ప్రాంతాలను ఆవిర్భవిస్తున్న తెలంగాణా రాష్ట్రంలో కాకుండా మిగిలిన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంచటాన్ని తెలంగాణా నాయకులు నిరసిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles