అధికార, ప్రతిపక్ష బాధ్యతల్లో తెదేపా
నవ్యాంధ్రప్రదేశ్ లో అధికారాన్ని చేపట్టి, విడిపోయిన తెలంగాణా రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాను చేపట్టి తను ఆశించినట్లుగానే ఇరు ప్రాంతాలు ఇరు నేత్రాలుగా ప్రకటిస్తూ వస్తున్న తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం పార్టీ పండుగైన మహానాడును గండిపేటలోని తెలుగు విజయంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ప్రారంభించనున్నారు.
జాతీయ హోదా
విడిపోయిన ఈ రెండు రాష్ట్రాలే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తెలుగు దేశం ప్రముఖ పాత్రను వహించనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఎంపీలు కేంద్రంలో మంత్రివర్గంలో సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేసారు. ఈ సారి మహానాడులో పార్టీ జాదీయ హోదాను గురించి కూడా చంద్రబాబు ప్రకటించనున్నారు.
మహానాడు కార్యక్రమాలు
మహానాడు కార్యక్రమాలు మంగళ బుధవారాలు రెండు రోజులు జరుగనున్నాయి. మోదీ ప్రమాణస్వీకారం తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా మహానాడుకి చేరుకుంటున్న చంద్రబాబు పార్టీ జెండా ఆవిష్కరణ తర్వాత ముందుగా ప్రధాన కార్యదర్శి పార్టీ వ్యవహారాల గురించి నివేదికను సమర్పిస్తారు. పోయిన సంవత్సరం కన్నుమూసిన నాయకులకు సంతాపం, అమరవీరులకు నివాళి అయిన తర్వాత, పోయిన సంవత్సరం పార్టీ జమా ఖర్చుల నివేదిక ఉంటుంది. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రారంభోపన్యాసం ఉంటుంది. దానితో ప్రారంభమయ్యే మహానాడు కార్యక్రమాలు రెండవ రోజు ఎన్టీఆర్ జయంతి రోజు బుధవారం సాయంత్రం తిరిగి చంద్రబాబు ముగింపు ఉపన్యాసంతో ముగుస్తుంది. ఈ మధ్యలో పలు నాయకుల ఉపన్యాసాలుంటాయి. రెండవరోజు ఉదయం ఎన్టీఆర్ కి నివాళులర్పించటం ఉంటుంది.
మహానాడు సభలో ఎన్నికల సమయంలో చేసిన హామీలన్నిటినీ మరోసారి గుర్తుచేసుకుంటూ వాటిని నెరవేరుస్తామన్న వాగ్దానం చెయ్యనున్నారు. అందులో, రైతుల ఋణ మాఫీ అన్నది ముందుగా చెయ్యవలసిన సంతకం.
ఈసారి మహానాడు మిగతా సభలకంటే భిన్నమైనది. దశాబ్దకాలం తర్వాత తెదేపాకు పట్టం కట్టినందుకు కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలకు ఆ పార్టీ కృతజ్ఞతలు తెలుపనుంది.
30 వేల మంది అతిథులకోసం సభాప్రాంగణం సిద్ధమైంది. వేదిక మీద 300 మంది నాయకులు కూర్చోవటానికి ఏర్పాట్లు జరిగాయి. వేదిక మీద వెనక భాగంలో ఎన్టీఆర్ చంద్రబాబుల పెద్ద పెద్ద ఫొటోలు ఏర్పాటు చేసారు.
పార్టీ ప్రతినిధులు, అతిథులు, వాలంటీర్లు, పోలీసులు, మీడియా ప్రతినిధులకు రెండు రోజుల పాటు భోజన వసతి ఏర్పాట్లు కల్పించిన మహానాడు నిర్వాహకులు తెలంగాణా, రాయలసీమ ఆంధ్రా రుచుల వంటకాలను వారి కోసం ప్రత్యేకంగా తయారుచేయిస్తున్నారు.
తెదేపా విజయాన్ని తెలుగు ప్రజల విజయంగా భావిస్తూ ఈ సభలో వారికే అంకితం చేయనున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more