నోటి ద్వారా తీసుకునే మందు మాత్రలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి శాపంలాగానే అనిపిస్తుంది. దానికంటే ముక్కుద్వారా మందుని స్ప్రే చేసినట్లయితే అది మెదడులో చేరవలసిన భాగానికి చాలా త్వరగా చేరుతుంది. ఈ విషయం మత్తు పదార్థాలు వాడే వాళ్ళను చూస్తే మనకు బాగా అర్థమౌతుంది. డ్రగ్స్ వాడేవాళ్ళలో ముక్కు ద్వారా పీల్చేవారికి మత్తు క్షణాల్లో ఎక్కిపోతుంది. మనదేశంలో ముక్కుపొడి కూడా ఒకప్పుడు బాగా ఉపయోగించేవారు. పొగాకుతో తయారుచేసే నస్యం అనే ఆ మందుని పీల్చటం వలన వెంటనే మెదడుకి చేరి వాళ్ళకి ఆనందాన్ని కలుగజేస్తుండేది.
సదరన్ డెన్మర్క్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ విధంగా త్వరితగతిని పనిచేసే మందుల మీద ప్రయోగాలు చేసారు. విశ్వవిద్యాలయంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ మాసిమిలియానో డి కాగ్నో ఈ విషయంలో మాట్లాడుతూ, మెదడుకి సంబంధించి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు పెద్ద మోతాదుల్లో మందులను వెంటవెంటనే ఇస్తుంటారు- అది కూడా దీర్ఘకాలం వరకు. దీనితో వివిధ సమస్యలు ఎదురౌతాయి. అందువలన దానికంటే సులభంగా ఔషధాలను ఇవ్వటం కోసం ముక్కు ద్వారా ముఖ్యంగా ముక్కులోని గోడ దాని మీద ఉండే పల్చని ముకోసా మీద మందుని చల్లటాన్ని అభివృద్ధి చేసారు. అని అన్నారు.
మెదడుకి సంబంధించిన మందులను సులభంగా ఇవ్వటం కోసం చేసిన ప్రయత్నంలో ఇది చాలా మంచి మలుపు అన్నారు డాక్టర్ కాగ్నో. ఇక తర్వాత చెయ్యవలసిన పని అలాంటి మందులను కొరత లేకుండా అందుబాటులోకి తేవటం. ఎందుకంటే దీర్ఘకాలంగా వ్యాధితో బాధపడుతూ గంటకోసారి మందు వేసుకోవలసిన పరిస్థితి ఉన్నప్పుడు ఇది చాలా సులువైన మార్గమని అన్నారాయన.
ముక్కులోపలకి మందుని చల్లటం వలన అది ముక్కు లోపలి గోడకు చేరి అక్కడి నుండి మెదడులోకి వెళ్ళవలసిన భాగానికి వేగంగా చేరుతుంది బాగానే వుంది కానీ, ఈ లోపులో ముక్కులోపలి నుంచి కిందికి జారిపోకుండా ఉండటం కోసం ముక్కు గోడలకు అంటుకుని ఉండే విధంగా ఆ మందులో జిగురు పదార్థాన్ని కలపటం కూడా అంతే అవసరమంటూ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ లో ఆ పరిశోధకులు తెలియజేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more