ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలోని ముఖ్య నగరమైన హేరాత్ లో నలుగురు ఉగ్రవాదులు మారణాయుధాలతో భారత దౌత్య కార్యాలయం మీద దాడిచేసారు. ఇది ఇరాన్ సరిహద్దులో ఉన్న ప్రాంతం.
కార్యాలయంలోని ఉద్యోగులంత క్షేమంగా ఉన్నారని, దుండగులను తరిమికొట్టటానికి ఎదురు దాడిలో భద్రతా సిబ్బంది ఉందని, న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్విట్టర్లో ప్రకటన చేసారు.
హేరాత్ పోలీస్ ఛీఫ్ జనరల్ సమీహుల్లా క్వాత్రా ఈ ఘటన మీద మాట్లాడుతూ, కాన్సులేట్ కి సమీపంలో ఉన్న ఇళ్ళల్లో నలుగురు ఉగ్రవాదులు ఉదయాన్నే మారణాయుధాలతో వచ్చి చేరారని, వారిలో ఆత్మాహుతి దాడి చేసేవాళ్ళు కూడా ఉన్నారని, వాళ్ళు అక్కడినుంచి ఇండియన్ కాన్సులేట్ మీద కాల్పులు జరపటం మొదలుపెట్టారని చెప్పారు. పరిసరాల్లోని నాగరికులను ఆ ఇళ్ళల్లోంచి ఖాళీ చేయించామని, కాల్పులు జరిపేవాళ్ళ మీద భద్రతా దళాల ఎదురు కాల్పుల కొనసాగుతున్నాయని కూడా ఆయన తెలియజేసారు.
దాడిచేసిన నలుగురిలో ఇద్దరు ఆత్మాహుతి దళంవాళ్ళు మృతి చెందారని, ఒకతను గాయపడ్డాడని, నాలుగో మనిషి ఇంకా కాల్పులు జరుపుతూనేవున్నాడని ఆప్ఘన్ క్విక్ రియాక్షన్ ఫోర్స్ కమాండర్ మొహమ్మద్ నాసర్ పాష్టున్ ప్రకటించారు.
ఈ దాడుల వెనుకనున్న సంస్థ గురించి కాని దాడుల లక్ష్యం గురించి కానీ ఇంకా ఏమీ తెలియలేదు. ఆప్ఘనిస్తాన్ లో భారత దౌత్య కార్యాలయం మీద దాడి జరగటం ఇది మొదటిసారి కాదు. 2008 లో కాబూల్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. అందులో 50 మంది చనిపోయారు, ఎంతో మంది గాయపడ్డారు. ఆ దాడి వెనక పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ పనిచేసిందని అమెరికా అధికారులు, భారత అధికారులు కూడా ఆరోపించారు.
తూర్పు ఆప్ఘనిస్తాన్ ల జలాలాబాద్ లో పోయిన సంవత్సరం దాడి జరిగింది. అయితే పోల్చి చూస్తే హేరాత్ ప్రాంతం మిగిలిన ప్రాంతాలకన్నా సురక్షితమని నమ్ముతూ వచ్చారు. ఆప్ఘనిస్తాన్ లో అన్ని దౌత్య కార్యాలయాలు ఉండటం విషయంలో పాకిస్తాన్ ఎప్పటినుంచో అభ్యంతరాలు తెల్పుతూనేవుంది.
(పై ఫోటోలో కాబూల్ లో భారత దౌత్యకార్యాలయం మీద ఆగస్ట్ 2013 లో జరిగిన దాడి)
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more