తాను స్వయంగా నిబద్ధతతో నడుస్తూ, ఛండశాసనుడిలా పనిచేసే నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 26 న ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ లోపులో మంత్రి వర్గాన్ని నిర్ణయిస్తే వాళ్ళు కూడా ఆరోజు ప్రమాణ స్వీకారం చెయ్యగలుగుతారు కాబట్టి భాజపా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చివుండాలి. అయితే మంత్రులను ఎక్కువ సంఖ్యలో నియమించకుండా పరిమితమైన సంఖ్యలో ఉంచితేనే వాళ్ళతో కలిసి ప్రభుత్వాన్ని నడపటంలో సౌలభ్యం ఉంటుందని మోదీ భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే ప్రధానమైనవారికి తప్పనిసరిగా మంత్రివర్గంలో చోటు ఇవ్వాల్సి కూడా వస్తుంది.
ముందుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ విషయానికి వస్తే ఆయన మూడు విధాలుగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగటమా లేక హౌమ్ శాఖ కానీ, లేదంటే రక్షణ శాఖ తీసుకోవటమా అన్నది తేల్చుకోలేకపోతున్నారు.
అత్యంత సీనియర్ నాయకుడు అద్వానీ లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించటానికి అంగీకరించారు.
అమృత్ సర్ లో పోటీచేసి ఓడిపోయిన సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీకి ఆర్థిక శాఖను ఇచ్చే అవకాశం ఉంది.
వాజ్ పాయ్ ప్రభుత్వంలో మానవవనరుల శాఖను తీసుకున్న మురళీ మనోహర్ జోషి ప్లానింగ్ కమిషన్ కి డెప్యూటీ ఛైర్మన్ గా బాధ్యతలు అప్పగించనున్నారు.
రవిశంకర్ ప్రసాద్ న్యాయ శాఖా మాత్యులుగా పనిచెయ్యవచ్చు.
15 వ లోక్ సభలో ప్రతిపక్షనాయకురాలిగా వ్యవహరించి అందరి మన్ననలందుకున్న సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖను చేపట్టవచ్చు.
ఇవీ సీనియర్ నాయకుల పోర్ట్ ఫోలియోస్. ఇక మిగిలిన నాయకులు, ఎన్డియే కూటమిలోని వారికి ఏమేం పదవులు కట్టబెట్టబోతున్నారన్నది ముందుగా భాజపా సీనియర్ నాయకుల విషయంలో నిర్ణయానికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన తెదేపా భాజపా ఎంపీలకు కూడా సముచిత స్థానం లభిస్తుందని సమాచారం.
-శీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more