హైద్రాబాద్ లో కిషన్ బాగ్ లో జరిగిన అల్లర్లు, పోలీస్ ఫైరింగ్ మీద గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశాలు జారీచేసారు. సంబంధిత పోలీసు అధికారులతో వివరణ తీసుకున్నారు. ఈ ఘటనలో మృతిచెందినవారి కుటుంబానికి రూ.6 లక్షలు, గాయపడినవారికి వైద్య చికిత్స కాకుండా అదనంగా రూ.50,000.00 పరిహారాన్ని గవర్నర్ ప్రకటించారు. ఆస్తినష్టం జరిగినవారికి కూడా నియమానుసారం పరిహారం అందుతుంది.
బుధవారం రాజేంద్రనగర్ పరిథిలోని కిషన్ బాగ్ లో అర్షమహల్ లో ఇరు వర్గాల మధ్య మారణాయుధాలతో పోరాటం జరిగింది. కారణం ఒక వర్గానికి చెందిన పతాకాన్ని మరొకరు కాల్చివేయటం. పోలీసులు వచ్చినా ఎవరూ అదుపులోకి రాకపోవటంతో బిఎస్ఎఫ్ జవాన్లకు ఫైరింగ్ చెయ్యవలసివచ్చింది.
కిషన్ బాగ్ లోని సిఖ్ ఛావని ప్రాంతంలో కొండ మీద ఒక వర్గం వారు, కొండ కింద మరో వర్గం వారు నివాసముంటున్నారు. ఆ మధ్య భాగంలో తమ మత విశ్వాసానికి చెందిన జెండాను పాతగా మరో వర్గం వారు రాత్రికిరాత్రి దాన్ని దహనం చేసారు. దీన్ని గమనించిన పోలీసులు పై అధికారులకు విషయాన్ని తెలియజేసి, ఇరు వర్గాలను ఎంత సముదాయించినా ఎవరూ అదుపులోకి రాకపోవటం, లాఠీ ఛార్జ్ కి కూడా బెదరకుండా పోరాటం సాగించటంతో ఫైరింగ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావలసివచ్చింది. జెండ్ సమీపంలోని ఇళ్ళను దగ్ధం చెయ్యటమే కాకుండా వాహనాలను కూడా తగులబెట్టారు. పోలీస్ కాల్పుల్లో ముగ్గుర మరణించారు, 12 మంది గాయపడ్డారు.
పై సంఘటనను మొత్తాన్ని విచారణ చెయ్యటానికి హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ ని నియమించారు గవర్నర్ నరసింహన్.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more