తెలుగు దేశం పార్టీ పరిషత్ ఎన్నికల ఫలితాలలో విజయాలు సాధించి గట్టి పోటీ అనుకున్న వైయస్ ఆర్ కాంగ్రెస్ ని వెనక్కి నెట్టివేసిన సందర్భంగా సార్వత్రిక ఎన్నికలలోనూ తెలుగు దేశం ప్రభంజనం సృష్టిస్తుందని, రాష్ట్రంలో అధికారం సంపాదిస్తుందని విశ్వసిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసే మొదటి సంతకం రైతు ఋణాల మాఫీ మీదనేనని పునరుద్ఘాటించారు.
తెదేపా ఎన్నికల హామీలలో ఒకటైన రైతుల ఋణ మాఫీ ఆచరీణం కాదని వైయస్ ఆర్ కాంగ్రెస్ విమర్శించింది. అయితే చంద్రబాబు అది ఎలా సాధ్యమౌతుందో తనకి తెలుసని, రైతులు, మహిళల డ్వాక్రా ఋణాలను మాఫీ చేస్తానని చెప్తూ వచ్చారు.
వ్యవసాయానికి తన ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని చంద్రబాబు నాయుడు తెలియజేసారు. గోదావరి ప్రాంతాలను వ్యవసాయ క్షేత్రంలోను, నెల్లూరు ప్రాంతాన్ని పారిశ్రామక క్షేత్రంలోనూ గణనీయమైన అభివృద్ధి సాధించేట్టుగా చేస్తానని చంద్రబాబు ఎన్నికల హామీల్లో తెలియజేసారు. అవినీతిని అంతమొందిస్తానని కూడా మాటిచ్చారు చంద్రబాబు.
వాటిలో ముందుగా రైతు ఋణాలను మాఫీ చేస్తానని, అదే తన తొలి సంతకమని చంద్రబాబు మరోసారి హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట కంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన మాటకే ఎక్కువ విలువుంది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయి వోటర్లు తమ అభిమతాన్ని ఇవిఎమ్ లలో నిక్షిప్తం చేసివుంచారు కాబట్టి, ఇప్పడు చంద్రబాబు చేసే వాగ్దానాల వెనక రాజకీయ ప్రయోజనం కనపడదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more