బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచారం కోసం అమరవీరుల పేర్లను ఉపయోగించుకోవడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మండి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని కులులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల సభలో ఆమె మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో అమరుడైన కెప్టెన్ విక్రం బాత్రా ఇచ్చిన క్వొటేషన్ ‘యే దిల్ మాంగే మోర్’ను మోదీ ప్రధానమంత్రి పదవిని కైవసం చేసుకోవాలన్న దురుద్దేశంతో ఉపయోగించుకున్నారని నిప్పులు చెరిగారు.
‘హిమాచల్ప్రదేశ్లో నిర్వహించిన ఎన్నికల సభలలో మోదీ మాట్లాడుతూ కార్గిల్ యుద్ధ అమరవీరుడైన కెప్టెన్ విక్రం బాత్రా పేరును ఉపయోగించుకున్నారు. కెప్టెన్ బాత్రా క్వొటేషన్ ‘యే దిల్ మాంగే మోర్’ను తన పార్టీకి ఓట్లు సంపాదించి పెట్టడానికి ఉపయోగించుకున్నారు’ అని సోనియా ధ్వజమెత్తారు. ‘ఉన్కా (మోదీకా) దిల్ సిర్ఫ్ కుర్సీ మాంగ్ రహా హై (మోదీ హృదయం కేవలం ప్రధాని కుర్చీని కోరుకుంటోంది)’ అని ఆమె విమర్శించారు. మోదీ ఇలా ఎన్నికల ప్రచారంలో అమరవీరుల పేర్లను వినియోగించుకోవడం వారిని అవమానించడమే అవుతుందని ఆమె అన్నారు.
మోదీ తాను అధికారంలోకి వస్తే ఏదో ఒరగబెడతానని ప్రజలకు భ్రమలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని సోనియా ఆరోపించారు. నిజానికి మోదీ ఎన్నుకున్న మార్గం విధ్వంసకర మార్గమని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎల్లవేళలా ఎలాంటి వివక్ష లేకుండా ప్రజాసంక్షేమానికి, సమాజంలోని పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ వస్తోందని ఆమె అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తి కాకుండానే, ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండానే మోదీ తాను ప్రధానమంత్రిని అయిపోయినట్లు మాట్లాడుతున్నారని సోనియా ఎద్దేవా చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more