చైన్నై సెంట్రల్ లో జంట పేలుళ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో అప్రమత్తమయ్యారు. దాన్ని అప్రమత్తమయ్యారనేదానికంటే ఉలిక్కిపడ్డారనటం సరేమో. ఎందుకంటే ఉలికిపాటు కాసేపే ఉంటుంది. తిరిగి మామూలుగా సర్దుకుంటుంది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రిజర్వ్ పోలీస్ సహాయంతో ఉలికిపాటు తనిఖీలను ప్రారంభించిన కొద్దిసేపటికే చేతకాదంటూ చేతులెత్తేసారు. కోటి ముప్ఫై లక్షల మంది యాత్రికులు ప్రతిరోజూ రైలులో ప్రయాణిస్తున్నారు. అంతమందిని, వాళ్ళ చేతిలోని సామాన్లను తనిఖీ చెయ్యటం జరగని పని అన్నారు అధికారులు. . రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ విధుల్లో రైల్వే ఆస్తులను కాపాడటం ప్రముఖంగా ఉంది.
దేశవ్యాప్తంగా లక్షల కోట్ల ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చే రైల్వే సేవల్లో సమయాన్నే పాటిస్తారా, ప్రయాణ భద్రతనే చూస్తారా, సాంకేతిక లోపాలు లేకుండానే చూసుకుంటారా ఇవన్నీ కాకుండా ప్రయాణీకులనందరినీ అనుమానంగా చూసి తనిఖీలు చేయిస్తారా. ఒకళ్ళను తనిఖీ చేస్తుంటే వందమంది తోసుకుని ముందుకు పోతుంటే ఆ ఒక్కళ్ళను చూసి కూడా లాభమేముంటుంది. అనుమానస్పద ప్రవర్తన ఉన్నా లేదా సమాచారం అందినా చూడవచ్చేమో కానీ ప్రయాణీకులందరినీ చెక్ చెయ్యటం సాధ్యం కాని పని అంటూ అధికారులు వివరించారు.
అందువలన ఆ రద్దీలో ఉగ్రవాదులకే కాక ఇంకా ఎందరో సంఘ విద్రోహులకు అవకాశం కూడా మెండుగా ఉంది. చిల్లర దొంగతనాలు, దోపిడీలు, మోసాలు జరిగిన కేసులు ప్రతి సంవత్సరం విపరీతంగా పెరిగిపోతున్నాయి.
మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సమస్య గా మారిన రైల్వే భద్రతకు పరిష్కారం ఒకటే- ఉగ్రవాద చర్యలను అరికట్టటం, వాళ్ళ ప్రయత్నాలను ముందుగానే వమ్ముచెయ్యటం. అంతే కానీ రైల్వే ప్రయాణీకులందరినీ పట్టుకుని వాళ్ళని ఆమూలాగ్రం తనిఖీలకు గురిచెయ్యటం అసంభవమైన కార్యక్రమం. సెక్యూరిటీ చెక్ లోంచి పోతున్నప్పుడు బీప్ బీప్ మంటూ గందరగోళంగా శబ్దాలు వచ్చినా అందరినీ పట్టించుకునే పరిస్థితి కనపడటం లేదు.
అయితే ఒకటి- భద్రతా దళాలు మోహరించాయంటే వాళ్ళని చూసి అప్రమత్తమైన చిల్లర దొంగలు, మోసకారులు కొంత వరకు నిరుత్సాహపడవచ్చు. కానీ ఉగ్రవాదుల విషయంలో అలా ఆలోచించటానికి వీల్లేదు. ఎందుకంటే ప్రాణాలకు తెగించి ప్రాణాలుతోడే వారికీ, ప్రాణాలు నిలబెట్టుకోవటం కోసం అది కూడా తప్పే అయినా దోపిడీలు మోసాలకు పాల్పడేవాళ్ళకి చాలా తేడా ఉంది.
రవాణాలో సామాన్య మానవులకు అందుబాటులో ఉన్న దేశంలో గుండెకాయలాంటి రైల్వే సేవలకు భద్రతా విషయంలో అధికారులు ప్రస్తుతానికి ఏం చెయ్యాలని తలలు పట్టుకోవటం తప్ప ఒక నిర్ణయానికి రాలేకపోయారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more