ఈ రోజు ఉదయం 7.15 కి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో 9 వ నంబర్ ప్లాట్ఫాం మీద ఆగివున్న బెంగళూరు గౌహతి ఎక్స్ ప్రెస్ లో ఎస్ 4, ఎస్ లలో జంట పేలుళ్ళు సంభివించాయి. అందులో గుంటూరుకి చెందిన స్వాతి అనే మహిళ మృతి చెందినట్లుగానూ విశాఖపట్నానికి చెందిన మహిళ గాయపడ్డట్టుగాను సమాచారం.
వివరాలకు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్- 044 2535 7398.
బుధవారం చెన్నైలో అరెస్టైన ఐఎస్ఐ ఉగ్రవాది జాకీర్ హుస్సేన్ కి ప్రతిస్పందనగా ఆ ఉగ్రవాద సంస్థనుంచి బాంబు దాడులు జరుగుతాయని పోలీసులు ఊహించినదే. అందుకే అప్రమత్తంగా ఉన్నా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా భారత్ లోకి ప్రవేశిస్తున్నారని పోలీసుల దగ్గర సమాచారం ఉంది.
ఈ సంఘటనమీద తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య దిగ్బాంతిని, ముఖ్యమంత్రి జయలలిత పరిహారాన్ని ప్రకటించారు. చనిపోయిన స్వాతి కుటుంబానికి లక్ష రూపాయలు, గాయపడినవారికి 50 వేలు, స్వల్పగాయాలైనవారికి 25 వేల రూపాయల పరిహారాన్ని జయలలిత ప్రకటిస్తూ దర్యాప్తుకు ఆదేశాలిచ్చారు.
బాంబు దాడికి లోనైన బోగీలను తొలగించి ఆ స్థానంలో కొత్త బోగీలతో రైలుని బయలుదేరదీసారు.
బాంబు దాడులు నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో పలు రైల్వే స్టేషన్లో విస్తృతంగా నిర్వహించిన తనిఖీలలో విజయవాడ జంక్షన్ లో పది నాటు బాంబులు దొరికాయి. ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ సభ జరుగనున్నందున నెల్లూరులో నిఘా పెంచిన పోలీసులకు అనుమానస్పదంగా రైల్వే స్టేషన్లో లభించిన సూట్ కేసు కాసేపు కలవరపరచింది. అది విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న పినాకినీ ఎక్స్ ప్రెస్ లో డి-8 కోచ్ లో 42 వ బెర్త్ కింద ఎవరికీ చెందని సూట్ కేస్ కనపడింది. దాన్ని ప్లాట్ ఫాం మీదకు దించిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ ని పిలిపించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more