వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వార్తా పత్రికలో చేసిన ప్రచురణలు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘిస్తున్నాయని, గతంలో కూడా అలాగే చేసారని, అలా మళ్ళీ మళ్ళీ నేరానికి పాల్పడటం వలన ఆ పత్రికను ఎన్నికల పరిసమాప్తమయ్యేంత వరకు నిషేధించవలసిందిగ ఎన్నికల కమిషన్ కి తెలుగు దేశం పార్టీ నాయకుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణ విజ్ఞప్తి చేసారు.
యనమల రామకృష్ణుడు చేసిన ఫిర్యాదు ప్రకారం ఆ పార్టీ సొంత పత్రిక లో నాలుగు పేజీలను కేవలం నిజాన్ని వక్రీకరించి తమకు అనుకూలంగాను, తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగానూ రాయటానికే కేటాయించింది, లోగడ ఆ పత్రికలో ఏప్రిల్ 2, 11, 24 తేదీల్లో కూడా అలాగే చేసింది.
ఆ వార్తా పత్రిక జర్నలిజంలోని అన్ని హద్దులనూ మీరిందని, కేవలం వైయస్ ఆర్ పార్టీ కరపత్రంలా తయారైందని తెదేపా నాయకుడన్నారు. ఇంతవరకు ప్రచురితమైన అటువంటి కథనాలను పెయిడ్ న్యూస్ గా లెక్కించి ఆ పార్టీ ఎన్నికల ఖర్చుగా పరిగణించాలని తెదేపా ఎన్నికల కమిషన్ ని కోరుతోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more