Court warning to kejriwal and three more leaders of aap

Court warning to Kejriwal and three more leaders of AAP, Kapil Sibal, Amit sibal, Vodaphone tax liability

Court warning to Kejriwal and three more leaders of AAP

కేజ్రీవాల్ మరో ముగ్గురు ఆఆపా నాయకులకు ఢిల్లీ కోర్టు హెచ్చరికలు

Posted: 04/19/2014 04:37 PM IST
Court warning to kejriwal and three more leaders of aap

కోర్టుకి హాజరవకపోతే బలవంతంగా హాజరుపరచవలసి వస్తుందని అరవింద్ కేజ్రీవాల్ మరో ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను ఢిల్లీ మెట్రో పోలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు హెచ్చరించింది.  సమాచార శాఖామాత్యులు కపిల్ సిబాల్ కుమారుడు అమిత్ వేసిన పరువు నష్టం దావాలో విచారణకు గైర్హాజరవుతున్న కేజ్రీవాల్, మనీష్ శిశోడియా, ప్రశాంత్ భూషణ్, షాజియా ఇల్మిలకు కోర్టు ఈ రోజు హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చే విచారణ తేదీ మే 24 కి హాజరవని పక్షంలో కోర్టు వారిని బలవంతంగా హాజరుపరచటానికి ఆదేశాలిస్తుందని చెప్పటం జరిగింది.

ఈరోజు హాజరు కాలేనందుకు లోక్ సభ ఎన్నికలు కారణమంటూ కేజ్రీవాల్ మిగిలిన ముగ్గురు ఆఆపా నాయకుల విషయంలో అనుమతించినా వచ్చే కోర్టు విచారణకు తప్పక హాజరవవలసివుంటుందని కోర్టు ఆదేశించింది.   దానితో పాటు ఈ రోజు హాజరు కానందుకు వారందరికీ రూ.2500 చొప్పున జరిమానా విధించింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles