పాతకేసులను తిరగదోడాలా, లేక కొత్తగా అవినీతి జరగకుండా చూడాలా అన్నది ఆలోచించవలసిన విషయమని, శక్తి యుక్తులను, సమయాన్ని దేనికోసం కేటాయించాలన్న నిర్ణయం తీసుకోవలసివుందని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఒక టివి ఇంటర్వ్యూలో తెలియజేసారు.
అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా, సాంకేతిక పరిజ్ఞానంతో, పారదర్శకమైన పాలనను చేస్తూ ఆదర్శవంతమైన వ్యవస్థను స్థాపించటమే లక్ష్యంగా పెట్టుకోవాలని తన అంతరాత్మ చెప్తోందని మోదీ అన్నారు. దాన్ని మళ్ళీ రాజనీతి చెయ్యగూడదన్న మోదీ, తన మీద అవినీతి ఆరోపణలు వచ్చినా వాటిని సమగ్రంగా దర్యాప్తు చేసి విచారణ జరిపేందుకు తాను సంపూర్ణంగా సహకరిస్తానని అన్నారాయన.
ఢిల్లీ జామా మస్జిద్ షాహి ఇమామ్ ని సోనియా గాంధీ కలవటాన్ని తప్పు పట్టిన భాజపా అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ముస్లిం మతస్తులను ఎలా కలిసారు అని అడిగిన ప్రశ్నకు, ఎవరు ఏ కులస్తులనైనా కలవవచ్చని, కానీ ఒక వర్గం వారి వోటు అడగటాన్ని మాత్రమే తప్పు పట్టటం జరిగిందని, అది రాజ్యాంగ విరుద్ధమని మోదీ సమాధానమిచ్చారు. ఎవరు ఎవరితో భేటీ అయ్యారన్నది కాదని, బయటకు వచ్చిన సందేశం ముఖ్యమని అన్నారాయన.
నేను హిందువులకో ముస్లింలకో మరే ఇతర కులస్తులకో వోటు కోసం ప్రత్యేకంగా విజ్ఞప్తి చెయ్యటంలేదు. నేను విజ్ఞప్తి చేసేది 125 కోట్ల భారతీయులకు. అది వాళ్ళకి నచ్చితే సరి. నచ్చకపోతే నన్ను ఓడిస్తారు అంతే అన్నారు మోదీ.
ఆర్ఎస్ఎస్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, భారత దేశంలో అతి పెద్ద ఏకైక స్వచ్ఛంద సంస్థని, ఓడిపోతున్నప్పుడలాల ఆ సంస్థ మీద బురదజల్లే పని కాంగ్రెస్ చేస్తునేవుంటుందని, పదేళ్ళలో కాంగ్రెస్ దేశాన్ని సర్వనాశనం చేసిందని, మన్మోహన్ సింగ్ ని పక్కన పెట్టి సోనియా రాహుల్ గాంధీలు దేశాన్ని దోచారని, అటువంటి యుపిఏ ప్రభుత్వాన్ని పడగొట్టాలని, భాజపాకి కనీసం 300 సీట్లు తక్కువ రాకుండా వోటర్లు సహకరిస్తే అది సాధ్యమౌతుందని ఆయన అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more