తెలంగాణా రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు హరీష్ రావు సిద్ధిపేటలో శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, గెలిచింది రాముడైతే గంతులేసింది కోతి మూకలంటూ తెలంగాణా సాధించింది తెరాస అయితే కాంగ్రెస్ నాయకులు కోతుల్లా గంతులేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో తెరాస పాత్ర ఏమీ లేదంటూ కరీంనగర్ లో సోనియా గాంధీ మాట్లాడిన మాటలను ఖండిస్తూ, అనివార్యంగా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వవలసిన అగత్యం పట్టబట్టే రాష్ట్ర విభజనను చేసారని చెప్తూ, కెసిఆర్ ఆమరణ దీక్ష చేసినప్పుడు కేంద్ర మంత్రి చిదంబరం డిసెంబర్ 9 న ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందన్న ప్రకటనను చేసిన విషయాన్ని గుర్తుచేసారు.
కెసిఆర్ జైలుకెళ్ళారు, 13 సంవత్సరాలు తెలంగాణా కోసం పోరాడారు, రావణుడిమీద విజయం సాధించినట్లుగా దుష్ట శక్తుల నుంచి తెలంగాణాను రక్షించుకున్నారు ప్రత్యేకతను సాధించారు. రాముడిలా పోరాడి సాధించకుంటే అది రాముడి గెలుపే అవుతుంది కానీ, వానరుల విజయం కాదని, కాంగ్రెస్ నేతలు ఆ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుందామని చూస్తున్నారని, కానీ వానరమూకలాంటి కాంగ్రెస్ దా గెలుపు కాజాలదని హరీష్ రావు అన్నారు.
ఎన్నికలలో కాంగ్రెస్ కి ఓటమి తప్పదని, ఆ నిరాశలోనే టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కెసిఆర్ మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారని, అయితే కాంగ్రెస్ కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హరీష్ రావు అన్నారు. తెలంగాణా కోసం చేసిన బలిదానాలను గుర్తుచేస్తూ, 1200 మంది అమరుల సూసైడ్ నోట్స్ ఉన్నాయని, వాటిని కావాలంటే జైరాం రమేష్ చూడవచ్చని, ఢిల్లీలోనే యాదిరెడ్డి తెలంగాణా కోసం ప్రాణత్యాగం చేసినప్పుడు ఈ జైరాం రమేష్ కనీసం చూడటానికైనా రాలేదని, అటువంటి వాళ్ళకి తెలంగాణా గురించి మాట్లాడే హక్కే లేనప్పుడు తెలంగాణా సాధన గురించి ప్రగల్భాలు చెప్పుకోవటం కూడదని హరీష్ రావు కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more