సీమాంద్ర అభ్యర్థులు కావలెను.. రాబోయే ఎన్నికల్లో ఫోటీ చేసే యువకులు, మంచి రాజకీయ నైపుణ్యం కలిగిన సీమాంద్ర అభ్యర్థులు కావలెనని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా గాంధీ భవన్ లో ఇలాంటి నోటీ బోర్డు పెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కోసం సీనియర్ కాంగ్రెస్ నాయకులు రంగలోకి దిగినట్లు సమాచారం.
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు దొరికేవి కావు. కానీ ఇప్పుడు సీమాంధ్రలో ఆ పార్టీ గుర్తు మీద పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదు. కాంగ్రెస్లోని ముప్పావు వంతు నేతలు ఇతర పార్టీల్లో చేరిపోయారు. పట్టులేదని తెలిసినా సీమాంధ్ర కాంగ్రెస్ ప్రచార సారథులు మాత్రం కాలికి బలపం పట్టువదలని విక్రమార్కుల్లా బస్సు యాత్ర చేపట్టారు. ఆ యాత్రతో మంచి ఫలితాలే వచ్చాయన్నారు.
ఎలాగోలా బస్సు యాత్రను ముగించేసిన నేతలు ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నారు. పోటీచేసేందుకు పెద్ద నేతలెవరూ ముందుకు రాకపోతుండటంతో చోటా మోటా నేతలనే అభ్యర్థులుగా ప్రకటించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
బస్సు యాత్ర చేసిన సమయంలో ద్వితీయ శ్రేణి నాయకులు చాలా మంది నుంచి అభ్యర్థనలు వచ్చాయి. వారిలోనే అభ్యర్థులను ఎంపిక చేసి టికెట్లు ఇచ్చి ప్రోత్సహించాలని ఏపీపీసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ డీసీసీ అధ్యక్షులు, నగర అధ్యక్షులతో ఈరోజు ఇందిర భవన్లో సమావేశం నిర్వహించనున్నారని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు.
సమావేశం తర్వాత అభ్యర్థుల లిస్ట్, మేనిఫెస్టోను తయారు చేసుకుని ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి సమర్పించాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా, ఆనం, చిరంజీవి బృందం యోచిస్తోంది. అధిష్టానం ఆమోదం తర్వాత ఏప్రిల్ మొదటివారంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని వినికిడి.
దీంతోపాటు నిరుత్సాహంలో ఉన్న కేడర్లో ఉత్సాహం నింపేలా ప్రణాళిక రూపొందించాలని నేతలు భావిస్తున్నారు. వీరి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more