పాలమూరులో ప్రజాగర్జనలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పార్టీ నినాదం మొదటి నుంచీ జై తెలంగాణా జై ఆంధ్రప్రదేశ్ అనే ఉందని, రాష్ట్ర విభజనకు తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని అన్నారు. అందరికీ న్యాయం జరగాలని కోరుకున్నాం అది తప్పా అని ప్రశ్నించారాయన. జాతీయ పార్టీగా ఆవిర్భవించబోతున్న మా పార్టీ ఢిల్లీని శాసిస్తుంది. సుపరిపాలన సాధించగలగటం మాకే సాధ్యమౌతుంది. బాబ్లీ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా పోరాడింది మేమే. ప్రణాళికాబద్ధంగా తెలంగాణాను అభివృద్ధి చెయ్యగలుగుతాం అంటూ చంద్రబాబు తన పార్టీ గురించి చెప్తూ, ఈ విధంగా తాము చెయ్యబోయే కార్యక్రమాలను వివరించారు.
మహబూబ్ నగర్ కి చెందిన లంబాడీ తండా నుంచి ఒకరిని ఎమ్మల్సీని చేస్తాం. రైతులు, డ్వాక్రా ఋణాలను మాఫీ చేస్తాం. అప్పటి వరకు ఎవరూ డబ్బులు కట్టకండి. దీపం పథకాన్ని పునరుద్ధరించి ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తాం. మహిళలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. తెలంగాణా రాష్ట్రానికి బిసి ని ముఖ్యమంత్రిని చేస్తాం. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తాం.
అలా తమ పార్టీ విధానాల గురించి, చెయ్యబోయే కార్యక్రమాల గురించి వివరించిన చంద్రబాబు తెరాసను, ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ ని దుయ్యబట్టారు. తెరాస కేవలం ఉప ఎన్నికల పార్టీయేనని, ఎప్పుడూ సాధారణ ఎన్నికలలో గెలుపొందలేదని, ప్రజాగర్జనలో తెలంగాణా పర్యటన అయిపోయేసరికి తెరాస ఖాళీ అయిపోతుందని అన్నారు. అలాగే కెసిఆర్ గురించి మాట్లాడుతూ, ఆయన పనిచేసే రకం కాదని, కరీం నగర్ లో గెలిచిన తర్వాత అక్కడే ఇల్లు కట్టుకుంటాను, నెలలో 15 రోజులు అక్కడే ఉంటానని చెప్పినాయన ఫాం హౌస్ లోనే తిష్ట వేసారని అన్నారు. ఎప్పుడూ ఏ నియోజకవర్గం గురించి పట్టించుకున్న పాపాన పోలేదని కెసిఆర్ ని విమర్శించారు. తమ పార్టీ విధానం ఇంటింటికీ ఉద్యోగం ఇవ్వటమైతే, . కెసిఆర్ తమ ఇంటి వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వటానికి చూస్తున్నారని అన్నారు చంద్రబాబు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more