పవన్ కళ్యాణ్ బోణీ చాలా మంచిదనిపిస్తోంది.
ఆయన ఏ ముహూర్తాన మోదీని కలవటానికి వెళ్ళారో కానీ మన తెలుగు నటులంతా క్యూకడుతున్నారు. నాగార్జున వెళ్ళి కలిసి వచ్చారు, బ్రహ్మానందం, మోహన్ బాబు మోదీ అప్పాయింట్ మెంటు తీసుకుంటున్నారు.
భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి గత సంవత్సర కాలంగా దేశ వ్యాప్తంగానే కాకుండా అగ్ర రాజ్యాలలో కూడా తన ప్రాభవాన్ని పెంచుకున్నారు, దానితో పాటే భాజపాకి కూడా శక్తివంతమైన పార్టీ అనే అభిప్రాయాన్ని కలిగించారు. కాంగ్రెస్ పార్టీ ఇక బ్రతికి బట్టకట్టటం కష్టమేనన్న భావన కలిగేట్టుగా చేసారాయన.
ఇక మన రాష్ట్రంలో చూసుకుంటే రాష్ట్ర విభజనకు మద్దతును ప్రకటించిన భాజపా తెలంగాణాలో బలం పుంజుకుంది. చివరకు తెలంగాణా రాష్ట్రం తమ వలనే ఏర్పడుతోందన్న అభిప్రాయాన్ని కూడా తెలంగాణా ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తోంది. అయితే సీమాంధ్రలో కూడా అధికారాన్ని సంపాదించాలంటే ప్రస్తుతం ఇక్కడ మరోసారి పుంజుకుంటున్న తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చెయ్యవలసిందేనని రాష్ట్ర విభజన కాకముందే గ్రహించిన భాజపా హైద్రాబాద్ లో జరిగిన మోదీ సభలో తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ని గుర్తు చేసుకోవటం, తెదేపా వైపు మైత్రీ హస్తాన్ని సారించటం జరిగింది.
ఇప్పడు తెదేపాతో పాటు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన, జయప్రకాశ్ నారాయణ లోక్ సత్తా పార్టీలు కూడా భాజపాకు మద్దతు తెలుపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో హైద్రాబాద్ లోని ఆస్తులను పరిరక్షించటానికి, సినిమా రంగాన్ని కాపుకాయటానికి ప్రభుత్వ అండదండలు ఎంతో అవసరం.
అందువలన రాజకీయంగా పైకి రావాలని అనుకునేవాళ్ళే కాకుండా రాజకీయంగా ఎదగాలని మాకు ఎలాంటి ఆసక్తి లేదు, పదవులు అసలే వద్దు అని అనే నటులు కూడా మోదీ ఫ్యాన్ క్లబ్ లో చేరటానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
తెలుగు ప్రజలలో వీళ్ళకున్న అభిమానులు ఈ విధంగా భాజపా గెలుపుకి కారణభూతమౌతుందని భాజపా కూడా నమ్ముతోంది. అయితే మా తెలుగు నటులు రాజకీయంగా ఉపయోగపడాలంటే మాకూ రాష్ట్రంలో బలం ఉందని నమ్మాలని తెదేపా చెప్పే ప్రయత్నం చేస్తోందని కొందరు విశ్లేషకుల వాదన. అంటే భాజపాతో పొత్తులో తెదేపాకి అనుకూలంగా సీట్ అడ్జెస్ట్ మెంట్లు జరగటానికి స్టార్స్ మద్దతుని తెదేపాయే మోదీ ఎదుట ప్రదర్శిస్తోందని వాళ్ళ ఉద్దేశ్యం.
ఇదే కాకుండా సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు నాయుడు హైద్రాబాద్ లోని అభివృద్ధిని షోకేస్ గా వాడుకుంటున్నారు. అంటే ఆయన ఏం చెయ్యగలరన్నది ఈ విధంగా చూపించటమే కాకుండా, గత రెండు సార్లు కాంగ్రెస్ కే పట్టం కట్టటం వలన ఆ పది సంవత్సరాలలో ఎంత చెయ్యలేకపోయామన్నది కూడా తెదేపా చెప్పటానికి అవకాశం ఏర్పడింది. ఇది కూడా భాజపాతో పొత్తులో ఉపకరించే అంశమే.
అలా తెలుగు నటులను తమకున్న తారాబలంగా తెదేపా చూపిస్తోందని రాజకీయ విశ్లేషకుల అంచనా.
ఏం చేసినా, ఎలా చేసినా లక్ష్యాన్ని ముందు చేరుకున్నవాళ్ళదే గెలుపు. అందువలన శక్తినంతా ఉపయోగించి ముందుకు పరిగెత్తాల్సిందే. మరో విషయమేమిటంటే, నిజంగా పనిచేసేవాళ్ళకి కూడా అధికారం చేజిక్కించుకోవటం అవసరమే. ప్రజా శ్రేయస్సుని కోరుకునేవారు కూడా వేరొకరికి అధికారం వస్తే వాళ్ళ సంక్షేమాన్ని సరిగ్గా పట్టించుకోరేమో అనుకుని కూడా వారిని అధికారంలోకి రానివ్వకుండా చెయ్యటం కూడా అవసరమే.
అందువలన, రాజకీయపు ఎత్తులు పై ఎత్తులలో ఎవరినీ తప్పుపట్టటానికి లేదు!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more