ఇంటారాక్టివ్ వోయిస్ రెస్పాన్స్ విధానం (ఐవిఆర్) లో దేశం లో మొదటిసారిగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి తన హైటెక్ విధానాన్ని తెలుగు ప్రజలకు రుచి చూపిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్థులను ఎన్నుకునే విధానంలో కూడా ప్రజాస్వామ్య పద్దతిని అవలంబించినట్లుగా తెలుస్తోంది.
తన సరికొత్త విధానాన్ని మీడియాకు వివరించిన చంద్రబాబు నాయుడు, ప్రతి నియోజకవర్గం నుంచీ తమ పార్టీ టికెట్ మీద ఎవరెవరు అభ్యర్థులు ప్రజల దృష్టిలో సరైనవారన్నది వారి ద్వారా తెలుసుకోవటానికి చేసే ప్రయత్నంలో కోట్లాది మందికి సెల్ ఫోన్లలో పంపించే మెసేజ్ లలో ప్రతి నియోజకవర్గంలోనూ ముగ్గురు అభ్యర్థులలో ఎంపిక చేయమని కోరుతారు. అభ్యర్థులలో 1, 2, 3 లేదా ఎవరూ నచ్చకపోతే 0 నొక్కటం ద్వారా వాళ్ళు తమ అభిమతాన్ని పార్టీకి తెలియజేయగలుగుతారు. వచ్చిన స్పందనను బట్టి అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
కొత్తగా పార్టీలో చేరిన వారు కూడా ఇందులో ఉంటారా అని అడిగితే, తప్పక ఉంటారని, ఈ విషయంలో తను కూడా మినహాయింపు కాదని చంద్రబాబు నాయుడు అన్నారు. తను కూడా ఐవిఆర్ లో ఎంపికవుతేనే పోటీలో నిలబడటం ఉంటుందని చెప్పారాయన. శాసన సభకీ లోక్ సభకీ కూడా అభ్యర్థులను ఈ పద్ధతిలోనే ఎంపిక చెయ్యటం జరుగుతుందన్నారాయన.
అంటే, ఇది ఒపీనియన్ పోల్ లాంటిది. అభిప్రాయ సేకరణ చేసి దాన్నిబట్టే పార్టీ తరఫున ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చెయ్యటం వలన కచ్చితంగా వాళ్ళు గెలిచే అవకాశం, ఫలితంగా తెలుగు దేశం పార్టీ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంటుందన్నది వినటానికి చాలా బావుంది, ఏ అభ్యర్థైనా ఎంపిక కాకపోతే చంద్రబాబుని తప్పు పట్టటానికి ఉండదు, ఆయన మీద ఆగ్రహించటం జరగదు, అలిగి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి వీలుండదు. అలా ఆయన అవలంబిస్తున్న ఈ విధానం శ్లాఘనీయం.
ఈ విధానం వలన పార్టీలో పనిచేస్తూ వచ్చిన పాత నాయకులను విస్మరించారనే అపవాదు కానీ, కొత్తగా వచ్చిన నాయకులకు న్యాయం చెయ్యటం లేదనే విమర్శ కానీ ఉండదన్నిది చంద్రబాబు చాణక్యం. విశాఖపట్నంలో తెదేపా ప్రజాగర్జనలో కాంగ్రెస్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేరుతున్న సందర్భంలో తెదేపా నేత అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు గంటాకు మనసు చివుక్కుమనేలా చేసాయి. కాబట్టి పార్టీ అధినాయకత్వానికి అసలు పరీక్ష ఉండేది ఈ సందర్భంలోనే. దాన్ని అధిగమించటానికి చంద్రబాబు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారని తెలుస్తోంది.
అంతా బాగానేవుంది కానీ కేవలం నియాజక వర్గం నుంచి రెండు లక్షల మంది వోటర్ల నుంచి, తెదేపా కార్యకర్తల నుంచే ఈ ఎంచుకునే అవకాశం ఇవ్వటం జరుగుతోంది. తెదేపా కార్యకర్తలైతే తెదేపా నాయకులకే ప్రాధాన్యతనిస్తారన్నది సత్యం. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సీనియర్ నాయకుల గురించి ఏం తెలుస్తుంది, ఎందుకు ప్రాధాన్యతనిస్తారు. అందువలన, ఎంపిక వలన పార్టీలో అంతర్యుద్ధాలు రాకుండా ఉంటాయని ఆశిస్తే సరేనేమో కానీ, ఈ విధానంలో సరైన అభ్యర్థి కచ్చితంగా ఎంపికవుతారన్నది మాత్రం నిజం కాదు.
ఈ విధానం దేశంలో నూతనమైనదే కావొచ్చు కానీ ప్రజాభిమతాన్ని సేకరించటానికి ఉన్న వాటిలో ఇది ఒక విధానం మాత్రమే. దీని వలన కచ్చితమైన ఫలితాలను ఆశిస్తే అది తప్పే అవుతుంది. ఎందుకంటే అభిప్రాయ సేకరణలో తీసుకునేది శాంపిల్ అభిప్రాయమే. శాంపిల్ ఫలితం సంపూర్ణ ఫలితమవాల్సిన పని లేదు. ఈ సంగతి మనకి ఒపీనియన్ పోల్స్ లో లోగడ ఎన్నో సార్లు నిరూపితమైంది.
ఒపీనియన్ పోల్స్ మీద రాసిన ఈ ఆర్టికిల్ ని కూడా చదవండి!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more