గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ని కలవటానికి సమయాన్ని కేటాయించలేకపోయారు. దానితో కేజ్రీవాల్ వెనుదిరిగి తన పర్యటనను కొనసాగిస్తూ జైపూర్ వైపుగా వెళ్తున్నారు.
నాలుగు రోజులుగా గుజరాత్ లో పర్యటిస్తూ, నరేంద్ర మోదీ దేశ పర్యటన చేస్తూ చెప్తున్నవన్నీ అతిశయోక్తులని, అంతటి ప్రగతి గుజరాత్ లో కనిపించలేదని చెప్పిన కేజ్రీవాల్ కి అడుగడుగునా భాజపా కార్యకర్తలు, గుజరాత్ పోలీసుల అడ్డు తగుల్తూనేవున్నారు. కానీ మీడియా వెంటనే ఉంది కాబట్టి వచ్చే అడ్డంకులన్నీ తనకు ప్రయోజనకరంగానే ఉంటాయని తెలుసు కాబట్టి కేజ్రీవాల్ ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో నరేంద్ర మోదీని కలవటానికి మందీ మార్బలంతో వెళ్తుండగా గుజరాత్ పోలీసులు అడ్డుకుని అందుకు అప్పాయింట్ మెంటు ఉందా అని అడిగారు. లేదని చెప్పేటప్పటికి ఆయనను ముందుకు వెళ్ళనివ్వలేదు. అప్పుడు కేజ్రీవాల్ తో పాటు ఉన్న ఆఆపా నాయకుడు శిసోడియా మోదీ దగ్గర సమయం తీసుకోవటానికి వెళ్ళారు.
ఈ లోపులో కేజ్రీవాల్ తను ముఖ్యమంత్రిని కలిసి ఏమేం అడగదలచుకున్నదీ మీడియాకు వివరించారు. 16 ప్రశ్నలను తయారు చేసానని వాటిని అడగటానికే మోదీతో సమయాన్ని కోరుతున్నానని ఆయన మీడియాలో ప్రకటించారు. దానితో ఆయన అనుకున్నది సాధించినట్లే నిజానికి.
ఇవన్నీ చూస్తున్న మోదీ తన బిజీ షెడ్యూల్ లో సమయాన్ని కేటాయించలేనని అన్నారు. పోనీ రెండు మూడు రోజుల తర్వాతైనా సమయాన్నివ్వమని అడిగానని, అదీ కుదరలేదని శిసోడియా తిరిగి వచ్చారు చెప్పారు. చేసేది లేక కేజ్రీవాల్ అక్కడి నుండి బయలుదేరి తన పర్యటనను కొనసాగిస్తున్నారు.
కేజ్రీవాల్ పద్ధతి చికాకు పెడుతున్న మాట వాస్తవమే, భాజపా వ్యూహాలకు అడ్డు తగులుతున్న మాటా వాస్తవమే కానీ ఎంత పని ఉన్నా గుమ్మంలోకి వచ్చిన ఒక మాజీ ముఖ్యమంత్రిని కలవలేకపోవటమనేది సరైనది కాదు. మాట్లాడే సమయం లేకపోయినా చూసి పలకరించవచ్చు, సమయం లేదని తనే స్వయంగా చెప్పవచ్చు కానీ కేజ్రీవాల్ ని కలవటానికే తిరస్కరించటంతో కేజ్రీవాల్ చర్యలు మోదీని ఎంత కలవరపెడుతున్నాయో మనస్తాపం కలిగిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
సమయం అనేది ఎవరికైనా సమానమే. సమయం లేదు అంటే అర్థం, నీతో మాట్లాడేదానికన్నా నాకు ఇంకా ఎక్కువ ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయని చెప్పటం. ఎంత బిజీగా ఉండే మనిషైనా తన సొంత పనులలో అవసరం పడ్డా, లేక తనకి అవసరమైన వాళ్ళని కలవాలన్నా, ఏదైనా అత్యవసర పరిస్థతి ఏర్పడ్డా, తప్పకుండా తమ కార్యకలాపాలలో మార్పులు చేసుకుంటారు. అలా చేసుకోలేదూ అంటే ఆ సందర్భానికి ప్రాధాన్యతనివ్వటం లేదన్న మాట. అయితే తను అనుకున్నది సాధించిన విజయోత్సాహం కేజ్రీవాల్ లోనూ కలిగుంటుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more