రాష్ట్ర విభజన బిల్లును అడ్డదిడ్డంగా ఆమోదింపజేసుకున్నారనే భావనతో భాజపా, కాంగ్రెస్ పార్టీలకు సీమాంధ్రలో పరపతి పోయింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఊపందుకుంటుందనుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తెదేపాలోకి వలసపోతున్న తరుణంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు నిర్వహించటం మొదలుపెట్టింది. భారతీయ జనతా పార్టీ సీమాంధ్రకు న్యాయం చేసింది తామేనంటూ ప్రచారాలకు పూనుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దగా భయపడేది లేకపోయినా ప్రస్తుతం ఆవిర్బవించనున్న మరో రెండు పార్టీలతో కలిపి ఆరు పార్టీలు సీమాంధ్ర ఎన్నికల బరిలో నువ్వా నేనా అంటూ పోటీ చెయ్యనున్నాయి.
మాజీ ముఖ్యమంత్ర కిరణ్ కుమార్ రెడ్డి, బహు సంఖ్యలో అభిమానులున్న సినీ నటుడు, మెగా స్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్ తమ తమ సొంత పార్టీలు పెట్టబోతున్న సందర్భంగా సీమాంధ్రలో ఆరు పార్టీలు గట్టి పోటీనివ్వబోతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు, లోక్ సత్తాలు కూడా పోటీ చెయ్యవచ్చు కానీ పై ఆరు దిగ్గజాల పోరాటంలో ఇవి కాస్త వెనకే ఉంటాయి.
పవన్ కళ్యాణ్ ఆదివారం 9 వ తేదీన, కిరణ్ కుమార్ 12 న రాజమండ్రిలో తమ పార్టీ వివరాలను తెలియజేస్తామంటున్నారు. దీనితో చీలిపోయే వోట్లుంటాయని, అప్పుడు అంచనా వెయ్యటం కష్టమౌతుందని తెలుగుదేశం పార్టీ వైకాపాలు ఆందోళన చెందుతున్నాయి.
జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కూడా ఇదే సమస్యను ఎదుర్కుంటోంది. కొత్త కొత్త పార్టీలు కొత్త కొత్త పొత్తులతో కూటమిలు తయారవుతుండటం అంచనాలను తలకిందులు చేసే ప్రమాదం ఉంది కాబట్టి భాజపా అటువంటివాటి మీద మండి పడుతోంది. థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ కి వోటేస్తే కాంగ్రెస్ కి వేసినట్లే సుమా అని హెచ్చరిస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more