ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్రలో పర్యటిస్తున్న జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మహాత్మా గాంధీని హత్య చేసింది ఎవరో కాదు ఆర్ఎస్ఎస్ అని థానేలో జరిగిన బహిరంగ సభలో అన్నారు.
సర్దార్ పటేల్, గాంధీలను వ్యతిరేకించినవారు, గాంధీని హత్య చేసిన ఆర్ఎస్ఎస్ అయితే ఇప్పడు భాజపా వాళ్ళిద్దరి పేర్లను చెప్పుకుంటోందని రాహుల్ అన్నారు.
ఇతరుల ఘనతను తమ ఖాతాలో వేసుకునే అలవాటున్న భాజపా ఇప్పుడు దేశంలో కంప్యూటర్లను తీసుకొచ్చి అభివృద్ధి చేసింది తమ పార్టీయేనని చెప్పుకుంటోంది. నిజానికి కంప్యూటర్లను భారతదేశానికి తీసుకునివచ్చి అభివృద్ధి చేసినవారు రాజీవ్ గాంధీ, శామ్ పిత్రోదాలు. అప్పుడొక సీనియర్ ప్రతిపక్ష నాయకుడు రాజీవ్ గాంధీ కంప్యూటర్ల గురించి మాట్లాడటమెందుకు అని ప్రశ్నించారు కూడా. కానీ ఇప్పుడు చూడండి పది సంవత్సరాలలో కంప్యూటర్ల వలన భారతదేశం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిందో అన్నారు రాహుల్ గాంధీ. అప్పుడేమో కంప్యూటర్లు వస్తే మనుషుల పొట్టమీద కొడుతుందని, ఉపాధి కోల్పోవటం జరుగుతుందని అన్నారు, ఇప్పుడేమో వాటిని తెచ్చింది తామే అంటున్నారు అన్నారు రాహుల్.
కంప్యూటర్ ఘనతను తమ ఖాతాలో వేసుకుంటున్నట్లే మరో ఐదారు సంవత్సారుల పోతే గ్రామీణ ఉపాధి హామీ (ఎన్ఆర్ఇజిఏ), సమాచార హక్కు (ఆర్ టి ఐ) కూడా తమ వలన వచ్చిందనే చెప్పుకుంటారంటూ రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీని విమర్శించారు.
60 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చెయ్యలేనిది మేము మూడు నెలలో చేసి చూపిస్తామని భాజపా నేతలు అంటున్నారు అది ఎలా సాధ్యమౌతుంది అని రాహుల్ గాంధీ తన రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనలోని రెండవ రోజున జరిగిన సభలో ప్రశ్నించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more