ఈసారి 2014 ఎన్నికలు కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంటున్నాయి.
మొట్ట మొదటిసారిగా నోటా (అభ్యర్థుల తిరస్కరణ వోటు) బటన్ ని ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్లలో పొందుపరుస్తున్నారు. ఏ అభ్యర్థికీ వోటు వెయ్యటం ఇష్టం లని పక్షంలో ఆ తిరస్కరణ బటన్ ని నొక్కి వోటర్లు తమ అభీష్టాన్ని తెలియజేయవచ్చు. అయితే దాని పర్యవసానమేమిటన్నది ఇంకా నిర్ణయాత్మకంగా తెలియజేయలేదు.
ఓటర్లకు ఇచ్చే స్లిప్ ల మీద ఓటర్ల ఫొటోలు ముద్రించబడుతున్నాయీసారి. దానితో దొంగవోట్లకు అవకాశం ఉండదు.
ఈసారి ఎన్నికల కమిషన్ చేస్తున్న మరో ప్రయోగం ఎలక్ట్రానిక్ డేటాలో పొందుపరచటమే కాకుండా వోటర్ తన వోటుని ఆ బటన్ మీద నొక్కి తెలియజేయగానే పేపర్ మీద పార్టీ పేరు, పార్టీ చిహ్నం ముద్రించబడి పక్కనే ఉన్న పెట్టెలో పడిపోతాయి. దానితో ఓటర్ కి ఎటువంటి అనుమానమూ లేకుండా ఉంటుంది. అంతకు ముందు బటన్ నొక్కటమే తెలుసు కానీ లోపల ఏం జరుగుతుందో వోటర్ కి తెలియదు. అంతే కాకుండా ఓట్ల లెక్కింపును అవసరమైతే చేత్తో కూడా లెక్కించే విధంగా పేపర్ మీద ప్రింట్ అవుతున్నాయి. కాని ప్రస్తుతం ఆటోమేటిక్ గా లెక్కించే దానితో పోలిస్తే అది చాలా కష్టమైన పని.
డబ్బు ఎరవేసి వోట్లు కాజేసే అభ్యర్థుల ఆట కట్టించటానికి ఎన్నికల కమిషన్ ఈసారి ఎక్కువ మంది పోలీసులను నిఘాలో పెడుతోంది. ఒకచోటి నుండి మరోచోటికి డబ్బు రవాణాను ఎలాగూ పోలీసులు అరికడుతూనేవున్నారు.
వోటర్ చైతన్యం పెరిగి, వోటర్లు కూడా పెరిగిన నేపథ్యెలో ఈసారి సుదీర తీరాలకు చేర్చటానికి అనువుగా లేనిచోట్ల జంతువుల సాయంతో ఎవిఎమ్ లను ఆయా ప్రదేశాలకు చేర్చనున్నారు. అందులో ఏనుగులు, కంచర గాడిదలు ఉపయోగపడబోతున్నాయి.
ఈసారి ఎన్నికల షెడ్యూల్ ని తయారు చెయ్యటానికి ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం నెలకొన్న వాతావరణాన్ని కూడా లెక్కలోకి తీసుకున్నారు ఎన్నికల కమిషన్. రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి గెజెట్ లో ప్రచురితమవనందున ఒకే రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహిస్తున్నా, రెండు ప్రాంతాలకు వేరు వేరు రోజుల్లో మధ్యలో చాలా ఖాళీ సమయం ఉండేట్టుగా ప్రణాళిక చేసింది ఎన్నికల కమిషన్. తెలంగాణాలో ఏప్రిల్ 30 న ఎన్నికలు జరుగుతుండగా సీమాంధ్రలో వారం తర్వాత మే 7 న ఎన్నికలు జరుగబోతున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more