తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జరగబోయే లోక్ సభ ఎన్నికల ఎంపీల జాబితాను విడుదల చేయట జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలోని 23లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం.
లోక్ సభ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల జాబితా వివరాలు. (ఈ జాబితా అధికారకంగా విడుదల చేయలేదు. కానీ మీడియాలో , ఈ జాబితా హల్ చల్ చేస్తుంది) మంత్రి గంటాశ్రీనివాస్రావు టీడీపీలోకి రావటం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ తరపున విశాఖపట్నం ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని సమాచారం.
మరోవైపు వైసీపీ నుంచి బయటికి వచ్చి ఈ మధ్యే బీజేపీలో చేరిన రఘురామరాజు కూడా టీడీపీలో చేరే అవకాశముంది. ఆయనకు నర్సాపురం స్థానం కేటాయించినట్లు సమాచారం.
సీమాంధ్రలో లోక్సభ స్థానానికి
విశాఖపట్నం నుంచి గంటా శ్రీనివాస్ (ఇంక చంద్రబాబు, గంటా శ్రీనివాసరావు ల మద్య చర్చలు జరుగుతున్నాయి)
విజయవాడ లోక్సభ స్థానానికి కేశినేని నాని,
మచిలీపట్నం-బాడిగ రామకృష్ణ,
అమలాపురం-గొల్లపల్లి సూర్యారావు,
కాకినాడ-విశ్వం,
అనకాపల్లి-చింతకాయల విజయ్,
రాజమండ్రి- మురళీ మోహన్,
నర్సాపురం-రఘురామరాజు, (చర్చలు జరుగుతున్నాయి)
విజయనగరం నుంచి అశోకగజపతి రాజు,
శ్రీకాకుళం-కింజరపు రామ్మోహనరాయుడు,
హిందూపురం-నిమ్మల కిష్టప్ప,
అనంతపురం-జేసీ ప్రభాకరరెడ్డి,
చిత్తూరు-శివప్రసాద్,
గుంటూరు లోక్సభ స్థానానికి గల్లా జయదేవ్ పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం.
నెల్లూరు స్థానానికి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమచారం.
తెలంగాణలో లోక్సభ స్థానానికి:
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి రమేష్ రాథోడ్,
నిజామాబాద్-అరిగెల నరసారెడ్డి,
కరీంనగర్-పెద్దిరెడ్డి,
జహీరాబాద్-మదన్మోహన్,
ఖమ్మం ఎంపీ స్థానానికి నామా నాగేశ్వరరావు పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం.
హైదరబాద్ లోక్సభ స్థానానికి జహీర్ అలీఖాన్,
సికింద్రాబాద్-తలసాని శ్రీనివాస్యాదవ్,
మల్కాజ్గిరి స్థానానికి రేవంత్రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
అయితే చివరి నిమిషంలో ఒకటి రెండు మార్పులు చేర్పులు చేయవచ్చు టిడిపి నాయకులు అంటున్నారు. అ జాబితా పై ..టిడిపిలోని నాయకులు మద్య పెద్ద చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
నోట్ .. ఈ జాబితాను .. తెలుగుదేశం పార్టీ నుండి గానీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నుండి గానీ ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ జాబితాలోని పేర్లు పూర్తిగా మారిన ఆశ్చర్యంలేదు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more