తెలంగాణా ప్రాంతంలోని ముంపుకు గురయ్యే 136 గ్రామాలు తెలంగాణాను విడదీయగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపటం వలన ఆ ప్రాంతాల ప్రజాప్రతినిధులకు ఇరు రాష్ట్రాలలోనూ ప్రాతినిధ్యం వహించవలసి వస్తుంది.
తెలంగాణా ప్రాంతంలోని ఆ 136 గ్రామాలలోని 60000 మంది జనాభాకు ప్రాతినిధ్యం వహించే ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో ఈ లోపులోనే ఎన్నికల కమిషన్ డిలిమిటేషన్ తంతుని పూర్తి చెయ్యకపోయినట్లయితే వాళ్ళుండేది ఆంధ్ర ప్రదేశ్ లో, లోక్ సభ, శాసన సభలలో తెలంగాణాలో ఉంటారు.
ఈ సమస్య తెలంగాణా ఆవిర్భావ దినాన్ని (అప్పాయింటెడ్ డే ని) ఎన్నికల లోపులోనే ప్రకటించినట్లయితే తలెత్తుతుంది.
ఇలాంటి సమస్యే విద్యారంగంలో భద్రాచలం డివిజన్ లో లోగడ ఒకసారి తలెత్తింది. భద్రాచలం డివిజన్ ఖమ్మం జిల్లా కింద ఉండగా విద్యాసంస్థలు మాత్రం అంతకు ముందు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నప్పటి లాగానే ఆ జిల్లా విద్యాశాఖ కింద కోనసాగాయి, పబ్లిక్ పరీక్షలు ఆంధ్రా యూనివర్శిటీ కిందికి వచ్చాయి. ఉపాధ్యాయులు తూర్పు గోదావరి జిల్లానుంచి వచ్చేవారు. దీనివలన విద్యార్థులు పై చదువులకు పోవటంలో సమస్యలను ఎదుర్కున్నారు. అప్పుడు ముల్కీ సర్టిఫికేట్ అవసరం కూడా ఉండేది కనుక భద్రాచలం డివిజన్ లోని విద్యార్థులు ఉన్నది తెలంగాణాలోనే అయినా కాలేజ్ చదువులకు ఆంధ్రా ప్రాంతానికి పోవలసివచ్చేది.
ఇలాంటి సమస్య ఇప్పుడు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులకు రాకుండా ఉండాలంటే అప్పాయింటెడ్ డేని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల తర్వాత ప్రకటించవలసి వుంటుంది. కానీ కాంగ్రెస్ కి మద్దతుగా నిలవటమో లేక విలీనం కావటమో చేసే దిశగా ఆలోచిస్తున్న తెరాస రెండు రాష్ట్రలలో ఎన్నికలు విడివిడిగా జరగాలని కోరుకుంటోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more