మేము అన్నమాటకు కట్టుబడివుంటాం. కాంగ్రెస్ లో విలీనానికి కానీ, పొత్తుకి కానీ మేము తయారే కానీ, నా పాత్ర ఏమిటో స్పష్టంగా చెప్పాలని తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ఢిల్లీ పెద్దలను అడిగినట్లుగా సమాచారం. కాంగ్రెస్ నాయకులు మాత్రం కెసిఆర్ తో అవగాహన కుదిరిందని ధీమాను వ్యక్తం చేస్తూ, తెలంగాణా ప్రభుత్వాన్ని నెలకొల్పటంలో కెసిఆర్ ది ప్రధాన పాత్ర ఉంటుందని కూడా అన్నారు. కాంగ్రెస్ తో విలీనానికే మొగ్గు చూపించారని అంటున్నారు.
అయితే కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి కంటే తక్కువ స్థాయిని తెరాస పార్టీ వర్గాలు జీర్ణించుకోలేవు. అంతే కాదు విలీనం, పొత్తులకు వచ్చేటప్పటికి తెరాస లో ఎంతోకాలంగా పనిచేస్తున్నవాళ్ళందరికీ రాజకీయంగా న్యాయం చెయ్యటం కష్టమౌతుంది.
అందువలన తెరాస నాయకుల స్పందన వేరేలా ఉంది. మొదటినుంచీ విలీనం పొత్తుల విషయంలో తొందరపడవద్దని కెసిఆర్ ని హెచ్చరిస్తూనేవున్నారు. టివి ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెసిఆర్ కుమారుడు కె తారకరామారావు విలీనం కంటే కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తుకే మొగ్గు చూపిస్తున్నామని అన్నారు. తెలంగాణా ప్రయోజనాల దృష్ట్యా తెరాస బలమైన శక్తిగా ఎదగటం ఎంతో అవసరమని కెటిఆర్ అన్నారు.
మాకు అధికారం కాదు కావలసింది, మాకు మా తెలంగాణా కావాలని మాత్రమే కోరుకుంటున్నాం, దానికోసమే పుట్టిన పార్టీ మాది అని తెలంగాణా రాష్ట్ర సమితి గురించి మాట్లాడుతూ వచ్చినా, ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితులలో తెరాస తనకు సంపూర్ణమైన మద్దతు లభిస్తుందన్న ఉద్దేశ్యంతో ఉంది కాబట్టి, విలీనం పొత్తులతో కాంగ్రెస్ కి లాభం చేకూర్చటం అవసరమై అన్న దిశలో కూడా ఆలోచించటం కూడా రాజకీయంగా తప్పేమీ కాదు.
సుదీర్ఘమైన ఉద్యమం తర్వాత ఉద్యమ లక్ష్యం ప్రత్యక్షరూపంలో తెలంగాణా ప్రజలకు అందాలన్న ఉద్దేశ్యంతో, ఇకముందు కూడా చురుగ్గా రాజకీయాలలో భాగస్వామ్యం వహించాలని అనుకోవటం అసహజమేమీ కాదు. అందుకోసం ఇతర పార్టీలతో కలవటమా వద్దా అన్నది చూసుకోవటం సబబే అంటున్నారు తెలంగాణా మద్దతుదారులు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more