Tg venkatesh proposes two capitals

TG Venkatesh, capital, Seemandhra, Kurnool, tg venkatesh proposes two capitals, congress party.

tg venkatesh proposes two capitals

మాకు రెండు రాజధానులు కావాలి?

Posted: 02/24/2014 09:31 AM IST
Tg venkatesh proposes two capitals

నిన్నటి  వరకు సమైక్యం అని అరిచిన నోర్లే ..నేడు.. మాకు రెండు  రాజధానులు కావాలని  డిమాండ్ చేస్తున్నాయి.  కర్నూల్  ను రాజధాని చేయాలని  టిజీ వెంకటేష్ డిమాండ్ చేస్తున్నారు.  బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయల సీమా హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు.

అయితే  ఆయన మొదటి   నుండి రాయలసీమ  నాయకులు  ఒకటే చెప్పారు. సమైక్యంద్ర కోసం  పోరాటం చేయటం అనేది  చచ్చిన పీనుగాతో సమానం కాబట్టి,  రాయల సీమ హక్కుల కోసం పోరాటం చేయమని రాయలసీమ నాయకులను వేడుకున్న విషయం తెలిసిందే. 

ఇప్పుడు అదే రాయలసీమ నాయకులు .. రాజధాని కోసం డిమాండ్ చేస్తుంటే.. బైరెడ్డి నవ్వుకుంటున్నారు. ‘‘ శరీరం కాలిన తరువాత ఎన్ని సోకులు చేసిన ఫలితం ఉండదని’’ బైరెడ్డి అంటున్నారు.  సమైక్యంలో ఉన్నప్పడు పోరాటం చేస్తే  ఫలితం ఉండేద కానీ,  రెండు రాష్ట్రాలు ఏర్పాడిన తరువాత  కేంద్రం చెప్పినట్లే  నడుచుకోవాలని  ఆయన అన్నారు.  

అయితే  టీజీ   వెంకటేష్  మాత్యం కర్నుల్ ను రాజధాని చేయకుంటే.. మళ్లీ ఉద్యమం చేస్తామని  అన్నారు. రాజధాని డిమాండ్ కోసం కర్నూలు జిల్లాకు చెందిన అన్ని పార్టీల నాయకులను కలుస్తామని, సమీకరిస్తామని రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అధినేత టి.జి.వెంకటేశ్ తెలిపారు. సీమాంధ్ర రాష్ట్రానికి రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని వెంకటేశ్ తెలిపారు.

జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రం తరహాలో శీతాకాలంలో కర్నూలులో ఒకటి, వేసవికాలంలో ఏదైనా కోస్తా ప్రాంతంలో ఒకటి చొప్పున రెండు రాజధానులను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆయన కోరారు. పలు త్యాగాలతో కర్నూలు చాలా కోల్పోయిందని, అంతేకాక తమ ప్రాంతం ఇతర ప్రాంతాల కన్నా చాలా వెనుకబడిపోయిందని వెంకటేశ్ తెలిపారు.

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles