Bifurcate country demands tdp mps

Bifurcate country demands TDP MPs, Modugula Venugopala Reddy, Sujana Chowdhery, Parliament speaker, Congress party

Bifurcate country demands TDP MPs, Modugula Venugopala Reddy

దేశంలోంచే విడదీయండి- సీమాంధ్ర తెదేపా ఎంపీలు

Posted: 02/15/2014 09:47 AM IST
Bifurcate country demands tdp mps

మా ప్రాంతానికి న్యాయం చెయ్యలేనప్పుడు మాకు ప్రత్యేక పార్లమెంటే ఇవ్వండి ప్రత్యేక దేశంగా విడిపోతాం అంటూ సీమాంధ్ర తెలుగుదేశం ఎంపీలు మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేసారు.  బాధితులనే సస్పెండ్ చెయ్యటమేమిటని ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. 

స్పీకర్ వెల్ లోకి వెళ్ళిన 57 మంది ఎంపీలలో 41 మందిని వదిలేసారు, 16 మందిని వెలివేసారు ఇదెక్కడి న్యాయమంటూ తెదేపా ఎంపీలు మోదుగుల వేణుగోపాల రెడ్డి, సుజనా చౌధరి, సిఎం రమేష్ లు ప్రశ్నించారు. 

అవిశ్వాస తీర్మానం చేసిన ఎంపీలను సస్పెండ్ చెయ్యటం ప్రజాస్వామ్యమా అని కూడా వాళ్ళు అడిగారు.  ఇలా వైఫల్యం పొందిన పార్లమెంట్ కంటే మా రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వండి మాకో పార్లమెంట్ ఇవ్వండి మా 25 స్థానాలనూ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లా విడదీయండి అంటూ వేణుగోపాల్ రెడ్డి ఆవేశపూరితంగా అన్నారు. 

భాజపా నేత సుష్మా స్వరాజ్ తో పాటు అందరూ బిల్లు పెట్టలేదని అంటుంటే విభజన బిల్లుని ప్రవేశపెట్టానని కేంద్రం అనటమేమిటి అన్నారు వేణుగోపాల్ రెడ్డి.  వీడియో ఫుటేజ్ ని బహిర్గతం చెయ్యండి.  నేను నిజంగానే కత్తి తీసుకుని సభ్యులను బెదిరించి వుంటే నన్ను ఉరితీయండి అన్నారాయన. 

పార్లమెంటులో ఆత్మరక్షణకు స్ప్రే వాడవలసి రావటం దురదృష్టకరం.  అందుకు బాధ్యులను తప్పు పట్టాలి కానీ బాధితులను కాదు అన్నారు వేణుగోపాల్ రెడ్డి.  స్పీకర్ లు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధులుగా పనిచేస్తున్నారని, వాళ్ళకి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టిస్తామని కూడా ఆయన అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles