ఇప్పటికైనా ఏం ముంచుకుపోలేదు ఇంకా సమయం ఉంది ముందుగా రాష్ట్ర విభజన బిల్లులో అవసరమైన సవరణలు చెయ్యండి. సీమాంధ్రులకు న్యాయం చెయ్యండి. మీరు తయారు చేసిన బిల్లులో విభజన వలన ఏర్పడే సీమాంధ్ర ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించలేదు- అన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ.
భాజపా మొట్టమొదటిసారిగా విభజన విషయంలో వెల్లడిచేసిన పార్టీ వైఖరిలో ఈ విషయాల మీద స్పష్టత కావాలని చెప్పటం జరిగింది- సీమాంధ్ర రాజధాని, సీమాంధ్ర హైకోర్టు, విభజన వలన నష్టపోతున్న ఆదాయాన్ని ప్రత్యామ్నాయం, నీరు కరెంటు పంపిణీలల భాగస్వామ్యం మొదలైనవి.
రాష్ట్ర విభజన బిల్లు మీద భాజపా నాయకులు వివిధ రకాలుగా వ్యాఖ్యానాలు చెయ్యటంతో అటు సీమాంధ్రలోనూ ఇటు తెలంగాణా లోనూ విమర్శలు ఎదుర్కుంటున్నారు. అందువలన తమ వైఖరిని భాజపా చాలా స్పష్టంగా ఈ విధంగా తెలియజేసిందనుకోవచ్చు.
మేము తెలంగాణాకు వ్యతిరేకులము కాము అంటూ మళ్ళీ మళ్ళీ చెప్తూ వస్తోంది భాజపా అయినా కాంగ్రెస్ పార్టీ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి బిల్లు ఆగిపోతే, చూసారా అంతా భాజపా వలనే జరిగింది అంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వగూడదన్నది భాజపా ఉద్దేశ్యం. బిల్లు మేం పెట్టకపోతే దాని ఘనతంతా భాజపాకు దక్కుతుందేమో తెలంగాణాను ఎలాగైనా తమ ఖాతాలోనే వేసుకోవాలన్నిద కాంగ్రెస్ తపన.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడకపోతే మనుగడ లేదనే ఉద్దేశ్యాన్ని తెలంగాణా ప్రాంత ప్రజల్లో బలంగా నాటుకుపోయేట్టు నాయకులు చెయ్యటం వలన, తెలంగాణా కోసం పోరాడకపోతే తెలంగాణా ప్రజలు ఆదరించరనే భావనతోనూ అన్ని పార్టీలలోనూ విభజన ఏర్పడి తెలంగాణా సీమాంధ్రగా ఏర్పడ్డాయి.
ఇలాంటి తరుణంలో ప్రతి పార్టీ చేసినట్లుగానే భాజపా కూడా తెలంగాణాకు వ్యతిరేకం కాదని, కాకపోతే సీమాంధ్ర ప్రజలకు న్యాయం చెయ్యటం అవసరమని చెప్తోంది. తెలుగు దేశం పార్టీ కూడా ఇదే వైఖరిని అవలంబిస్తోంది. అయినా తెలంగాణా నాయకులు ముఖ్యంగా తెరాసా పార్టీ నాయకుల విమర్శలను ఎదుర్కుంటోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more