దేశవ్యాప్తంగా మున్సిపల్ ఆఫీసుల్లో ఉన్నట్టుండి టీ దుకాణాలకు లైసెన్స్ లకు దరఖాస్తులు వస్తున్నాయి. దానితో పాటు చాయ్ బండ్లను తయారు చేసేవాళ్ళకి, టీ పొడి అమ్మేవాళ్ళకి, పాలు సరఫరా చేసేవాళ్ళకి కూడా గిరాకీ బాగా పెరిగింది. కమర్షియల్ గ్యాస్ కోసం అప్లై చేస్తున్నవారు కొందరైతే మన రాహుల్ బాబు 12 సిలెండర్లు ఇస్తున్నారుగా వాటిని ఉపయోగించుకుని టీ దుకాణం పెట్టుకుందామనే ఆలోచనలో మరి కొందరున్నారు.
ఉన్నట్టుండి టీ వినియోగదారులు అంతగా పెరిగిపోయారా అంటే కాదు మన కాబోయే ప్రధానమంత్రి టీ దుకాణాలకు మద్దతిస్తారట అని కొందరు, ఏవేవో రాయితీలు వస్తాయట అని మరికొందరు ఆశాభావాలను వ్యక్తపరుస్తున్నారు.
ఎవరు రాహుల్ గాంధీయా అంటే కాదెహే, నరేంద్ర మోడీ అన్నారు కాస్త లోకజ్ఞానం ఎక్కువున్నవాళ్ళు.
రేపు దేశవ్యాప్తంగా అందరు చాయ్ వాలాలతోనూ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ వీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడబోతున్నారన్న వార్త దావానంలో వ్యాపించటమే అందుకు కారణం. ఆయనతో మాట్లాడటానికి అందరూ చకచకా అర్హతలను సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ అర్హతేమిటంటే టీ దుకాణం యజమాని అయ్యుండటం.
చాయ్ దుకాణాలు, క్షౌరశాలలు ఈ రెండూ రాజకీయాలు మాట్లాడుకోవటానికి అనువైన స్థలాలు కాబట్టి క్షౌరశాలలను నిర్వహించేవాళ్ళకోసం పిలుపనిస్తే ఎలా ఉంటుందా అని రాహుల్ మద్దతుదారులు ఆలోచిస్తున్నారు. రెండు రోజులలో క్షౌరశాలల యజమానులతో రాహుల్ గాంధీ వీడియా కాన్ఫరెన్స్ లో చర్చిస్తారనే వార్త కూడా ఊపందుకుంది. దానితో గబగబా క్షౌరశాలలు కొత్తగా వెలుస్తాయని ఎదురు చూసారు కానీ అలా జరగలేదు.
అందుకు కారణం ఏమైయ్యుంటుందా అని విచారిస్తే, క్షౌరశాలలకు పెట్టుబడి ఎక్కువ కావలసివస్తోంది. చాయ్ దుకాణాల్లాగా ఎక్కడబడితే అక్కడ పెట్టటానికి వీలుగా ఉండదు. మరో సమస్య పనిచేసేవాళ్ళు చాయ్ దుకాణాల్లో దొరికినంత సులభంగా దొరకరు, పైగా వాళ్ళకి శిక్షణ కూడా అవసరం అని తెలిసింది.
సరే, మోదీగారంటే ఆయన తండ్రిగారు టీ దుకాణం నడిపి రైళ్ళలో సప్లై చేసేవారట, ఆయన కొడుకుగా మోదీ కూడా చేదోడుగా నిలిచారట చిన్నప్పుడు. (అప్పుడు బాలకార్మికుల చట్టం అమలులో లేదు లెండి) మరి రాహుల్ గాంధీకి, క్షౌరశాలకీ ఏ విధమైన సంబంధాన్ని కలిగించాలా అని ఆలోచించారు పార్టీ యువనాయకులంతా.
కటింగ్ చెయ్యకపోయినా కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా చేసేది అదేనని అంటే ఎలా ఉంటుంది అని ఒక బుడ్డి యువ నాయకుడు తన బుర్రలో మెరుపులా వచ్చిన ఆలోచనను బయటపెట్టాడు. ఛండాలంగా ఉంటుంది అని ఒక సీనియర్ యువనాయకుడు ఆ ప్రతిపాదనను గట్టిగా ఖండించాడు. కట్ చెయ్యటం గుండె గీయటం అనేదానికి తెలుగు వాడకంలో గౌరవంగా ఉపయోగించరు. తిరుపతి లో క్షౌరం చేసేవాళ్ళని కూడా విమర్శిస్తుంటారు అని మిగిలినవాళ్ళు ఆ బుడ్డోడికి వివరించారు.
మోదీని చూసి రాహుల్ గడ్డం పెంచుకున్నట్లువుతుందన్నారందరూ పులిని చూసి నక్క వాతపెట్టుకుందన్న శైలిలో!
ఆగండాగండి, ఇంతకీ మోదీ కాన్ఫరెన్స్ దేశమంతా కాదట కేవలం బీహార్ లోనేనట. బీహార్ లోని 15 జిల్లాలలో చాయ్ వాలాలతో రేపు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు మోదీగారి వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందట అన్నాడు వార్తను పూర్తిగా చదివిన టీ దుకాణాల సంఘానికి అధ్యక్షుడు.
అందుకు స్మార్ట్ ఫోన్లను సప్లై చేస్తున్నట్టున్నారు వాళ్ళందరికీ అన్నాడు ఆ అవకాశం పొగొట్టుకుంటున్నందుకు బాధపడుతూ ఒక తెలుగు చాయ్ వాలా.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more