కేంద్ర ప్రభుత్వం మనమాట వినకపోయినా అందరికీ పెద్ద రాష్ట్రపతి ఉన్నారులే అని భావించారో లేకపోతే దాన్ని నమ్మినట్టుగా నటించారో కానీ రాష్ట్ర విభజన బిల్లుకి వ్యతిరేకంగా రాష్ట్రపతికి వినతి పత్రాలందించినవారంతా బయటకు వచ్చి తాము చెప్పిందంతా ఆయన ఎంతో ఓపిగ్గా విన్నారని, తనకు చేతనైనంత న్యాయం చేస్తానని వాగ్దానం చేసారని తప్పకుండా ఆయన తన పరిధిలో సీమాంధ్రకు న్యాయం చేస్తారని చెప్పుకున్నారు. కానీ ముహూర్తం ముందే పెట్టుకుని కూర్చున్న కేంద్ర ప్రభుత్వం మిగిలిన తంతులన్నిటినీ పకడ్బందీగా తయారు చేసుకుని పెట్టుకుంటున్నదని ఆఘమేఘాల మీద ఆమోద ముద్ర వేసుకుని రాష్ట్రపతి దగ్గర్నుంచి బంతిలా తిరిగివచ్చిన బిల్లుతో అర్థమౌతోంది.
అంతే కాదు, బిల్లులను పాస్ చేయించటానికి కేంద్ర ప్రభుత్వం విపక్షాలను ఎలా ఒప్పించాలా ఏ విధంగా పాస్ చేయించుకోవాలా అనే వ్యూహాలు పన్నుతోంది కానీ ఈ విషయంలో రాష్ట్రపతి సహాయ సహకారాల గురించి ఎటువంటి అనుమానాలూ లేనట్టుగానే కనిపిస్తోంది.
పార్లమెంట్ హౌస్ లో రాజ్యసభ ప్రెసిడెంట్లు, లోక్ సభ స్పీకర్ల ఛాయాచిత్రాలను ఆవిష్కరించిన రాష్ట్రపతి ఆ తర్వాత తన ఉపన్యాసంలో పార్లమెంట్ లో సభ్యులు సంయమనాన్ని పాటించాలని, పార్లమెంటు గౌరవాన్ని కాపాడాలని కోరారు. చర్చలు, నిర్ణయాల ద్వారా పార్లమెంట్ పని చేయాలి కానీ ఆటంకాలు కలిగే విధంగా ప్రవర్తించగూడదని ఆయన అన్నారు.
బిలియన్ కి అధిక సంఖ్యలో ఉన్న ప్రజా వాణిని పార్లమెంట్ లోకి తీసుకుని రావటమంటే అది యావద్భారత ప్రజానీకానికి, ప్రభుత్వానికి మధ్య ఉన్న వారధి అంటూ ఉపమానంగా గంగోత్రి కలుషితమైనట్లయితే గంగ దాని ఉపనదులు కలుషితం కాక మానవని అన్నారు రాష్ట్రపతి. పార్లమెంట్ సభ్యులందరూ గౌరవప్రదమైన వారి స్థాయిలకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ పార్లమెంట్ సభలను సజావుగా సాగేందుకు దోహదం చెయ్యాల్సివుంటుందని రాష్ట్రపతి తెలియజేసారు.
కాంగ్రెస్ పాలిత యుపిఏ ప్రభుత్వం ఎన్నికల లోపులో జరుగుతున్న ఈ ఆఖరు సభాసమావేశాలలో వీలయినన్ని ఎక్కువ బిల్లులను పాస్ చేసే పనిలో పడింది. అందులో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి చేసిన రాష్ట్ర పునర్విభజన బిల్లు ఒకటి. రాష్ట్ర పతి మాట్లాడిన సందర్భాలు తక్కువే అయినా మాట్లాడిన ప్రతిసారీ ప్రభుత్వం కోరుకుంటున్నదానికి ఆయన పూర్తి మద్దతు కనిపిస్తోంది.
ప్రస్తుతమున్న తక్కువ సమయంలో మేము చేసాం అని ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవటానికి వీలున్న బిల్లుల మీద ఆమోద ముద్ర వేయించుకోవాలనుకుంటున్న సందర్భంలో రాష్ట్రపతి సూచనలు విశేషతను సంతరించుకుంటున్నాయి. ఆయన హైద్రాబాద్ విడిదికి వచ్చిన సందర్భంలో కూడా రాష్ట్ర విభజనలు అవసరమైనని, పెరుగుతున్న జనాభా దృష్టిలో రాష్ట్రాలు విడిపోకుండా అలాగే ఉండటం సాధ్యం కాదని కూడా వ్యాఖ్యానించారు. ఈ విధంగా పరోక్షంగా రాష్ట్రపతి మాటల్లో కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్నదేమిటో అందరికీ అర్థమయ్యేట్టు, దానికి తనవంతు సాయం ఎప్పుడూ ఉంటుందని చెప్పకనే చెప్పటం జరుగుతోంది.
అయితే ఆయన మీద గంపెడాశ పెట్టుకుని, బిల్లుకి రాష్ట్రపతి కార్యాలయం ఆఖరు అడ్డంకి అవుతుందేమోనని ఆశించిన సీమాంధ్ర నాయకులు భంగపడ్డారు. జరుగుతున్న వ్యవహారమంతా చూస్తుంటే రాష్ట్రపతికి వినతి పత్రాలందించినవారంతా, రాష్ట్రపతి తప్పకుండా వాటి మీద దృష్టి సారించి బిల్లును రాజ్యసభకు పంపించకుండా ఉంటారని అనుకున్ననాయకులంతా అనవసరంగా వృధా ప్రయాస పడ్డాం కానీ కేంద్రం అనుకుంది అనుకున్నట్టుగా చేస్తుందనే అభిప్రాయం కలిగి చేష్టలుడిగి ఉన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more