అఖిల పక్ష సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ తెలంగాణా బిల్లు మీద అనుమానాలు వ్యక్తపరచటంతో భాజపా యు టర్న్ తీసుకుంటోందా అన్న అనుమానాలను పలు వార్తా పత్రికలు, మీడియా వ్యక్తపరచాయి. అందులోనూ తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కి భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో ఇంటర్వ్యూ లభించకపోవటంతో ఆ అనుమానం ఇంకా బలపడసాగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆమోదం పొందిన తెలంగాణా బిల్లు మీద ముఖ్యమంత్రి తిరస్కరణ నిర్ణయానికి సుష్మా స్వరాజ్ విలువనిస్తూ మాట్లాడారు.
అయితే అదంతా ఏమీ లేదని భాజపా నాయకులు వివరణనిచ్చారు. సభ సజావుగా సాగితేనే తెలంగాణాకి మద్దతునిస్తామని అనటంలో భాజపా ఉద్దేశ్యాన్ని ఇలా వివరించారు.
దేశంలో అత్యవసరమైన అవినీతి వ్యతిరేక బిల్లులలాంటివి ఉన్నాయి. ఈ టెర్మ్ కి ఇదే ఆఖరు పార్లమెంటు సమావేశం కూడా. ఈ నేపథ్యంలో తెలంగాణా బిల్లు కూడా అజెండాలో ఉన్నట్లయితే తెలంగాణా, ఆంధ్రా నాయకుల నుంచి వ్యతిరేకతలు వస్తాయని, సభలో గందరగోళం ఏర్పడి సభ సాగకపోవచ్చని భాజపా భావిస్తోంది. అందుకు అంతకు ముందు సభలో నెలకొన్న గందరగోళ పరిస్థితి వలన కలిగిన అనుభవంతో ఈ సంగతి ప్రస్తావిస్తూ, సభను సజావుగా సాగించే బాధ్యతను ప్రభుత్వం తీసుకున్నట్లయిత తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు బిల్లుకి సహకరిస్తామని చెప్పారు. తెలంగాణా బిల్లు వలన సభలో ఆటంకాలు ఏర్పడవచ్చన్న అనుమానానికి కాంగ్రెస్ పార్టీ నాయకులే బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తుండటం, సాక్షాత్తూ ముఖ్యమంత్రే దీక్షకు పూనుకోవటం లాంటివి ఊతాన్నిస్తున్నాయన్నారు.
తెలంగాణా బిల్లు ప్రవేశపెడితే మరే చర్చకూ అవకాశముండదన్న ఉద్దేశ్యాన్ని సమాజ్ వాదీ పార్టీ, జెడి యు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు వెలిబుచ్చాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more