ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ ఒపీనియన్ పోల్ ఫలితాలననుసరించి,
1. నరేంద్రమోదీ నేతృత్వంలో భాజపాకు 188 స్థానాలు వచ్చే అవకాశం. దానితో అతి పెద్ద పార్టీగా అవతరించబోతోంది. 2009 ఎన్నికలలో సాధించిన స్థానాలు 116.
2. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి 91 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం. ప్రస్తుతం ఉన్న స్థానాలు 206.
3. యుపిఏ, ఎన్డీయే కాకుండా ఇతర పార్టీలు, స్వతంత్రులకు కలిపి 220 కి పైగా స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. అంటే థర్డ్ ఫ్రంట్ కి మంచి అవకాశాలున్నాయన్న మాట.
4. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ కి ఇటీవల కాలంలో హవా కనిపిస్తున్నా, ఆ పార్టీ సాయంతో భాజపాకి చెక్ పెడదామని చూస్తున్న కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కేజ్రీవాల్ ప్రాబల్యం కేవలం ఢిల్లీ ఆ చుట్టుపక్కల నగరాలకే పరిమితం అవుతుంది.
5. రాష్ట్రంలో చూసుకుంటే, కాంగ్రెస్ కి తెలంగాణా లో ఆశించిన ఫలితాలు రావు. సీమాంధ్రలోనూ, తెలంగాణాలోనూ కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ కి 7 స్థానలు, వైకాపా కి 13, తెదేపా కి 8 స్థానాలు లభించే అవకాశం. తెదేపా ఇరు ప్రాంతాలలోనూ బలపడుతుంది. తెదేపా పొత్తు భాజపాతో గనక జరిగితే, రెండు పార్టీలకూ లాభం జరుగుతుంది.
6. కాంగ్రెస్ ఆంధ్ర ప్రదేశ్ లోనే కాక తమిళనాడు లోనూ స్థానాలను దక్కించుకోలేక పోతుంది.
7. కర్నాటక, కేరళలలో చూసుకుంటే, కర్నాటకలో కాంగ్రెస్ కి 12, భాజపాకి 13 స్థానాలు రాగా బెంగళూరులో ఆమ్ ఆద్మీ పార్టీకి 1 స్థానం రావొచ్చు. కేరళలో కాంగ్రెస్కి 6, వామపక్షాలకు 11 స్థానాలు దక్కే అవకాశం ఉంది.
8. ఇక ప్రధాన మంత్రి అభ్యర్థిత్వానికి ఉన్న పరపతి చూసుకుంటే, నరేంద్ర మోదీకి 47 శాతం, రాహుల్ గాంధీకి 15 శాతం, అరవింద్ కేజ్రీవాల్ కి 9 శాతం కనిపించింది.
ఇది తెలిసే కాబోలు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తమ పార్టీ తరఫునుంచి ప్రధాన మంత్రి అభ్యర్ధని ప్రకటించలేదు
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more