ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా ఉచిత నీటి సరఫరాను మొదలు పెట్టిందో లేదో ఇంతలోనే దేశంలోని మిగతా రాష్రాలు సైతం తమకూ ఉచితంగా నీటిని అందించాలని గగ్గోలు పెడుతున్నాయి. ఢి్ల్లీలో అక్కడి ప్రభుత్వం ఉచితంగా నీటిని ఇవ్వగలిగి నప్పుడు మీరెందుకు ఇవ్వలేరని స్థానిక నాయకులను నిలదీస్తున్నారు. దీంతో అన్ని రాష్ర్లాల్లోనూ ఉచితంగా నీటిని అందించేందుకు గల సాధ్యసాధ్యాలపై విపరీతమైన చర్చలు సాగుతున్నాయి.
ఆమ్ ఆద్మీ తీసుకొచ్చిన ఈ విప్లవం ఇప్పుడు వాడవాడలా పాకిపోయింది.. దీంతో మన హైదరాబాద్ జలమండలి అధికారులూ చేసేదేమీలేక ఢీల్లీ వెళ్లి అక్కడి పరిస్థతులను అధ్యయనం చేయడంతో పాటు పలు సూచనలు తీసుకున్నారు. అనంతరం ఇక్కడ ఉచితంగా నీటిని అందిస్తే ఎంత ఖర్చవుతుంది? సాధ్యా సాధ్యాలేమిటన్న దానిపై కూలంకషంగా చర్చలు చేస్తున్నారు. అయితే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన జలమండలికి అది సాధ్యం కాకపోవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో 8 లక్షల నల్లా కనెక్షన్లుంటే, వాటిలో 2 లక్షలు పేదలకు చెందినవి. రోజుకు 340 గ్యాలన్ల నీరు నగరానికి అవసరమవుతుండగా, అతికష్టం మీద సరఫరా చేస్తున్నారు.
నల్లా కనెక్షన్ ఉన్న ప్రతీ పేద కుటుంబం నుంచి నెలకు 200 వసూలు చేస్తున్నారు. వీరందరికీ ఉచితంగా నీరు అందివ్వాలంటే నెలకు 180 నుండి 200 కోట్ల భారం పడుతుంది. అదీగాక ఇప్పటికే జలమండలికి అనేక అప్పులున్నాయి. జలమండలికి నెలకు 61 కోట్ల రూపాయల ఆదాయం వస్తుండగా ఖర్చు 91 కోట్ల రూపాయలను దాటిపోతోంది. పైగా పెద్ద పెద్ద సంస్థలు, పలు ప్రభుత్వ కార్యాలయాలు ఏళ్ల తరబడి నీటి బకాయిలను చెల్లించడమే లేదు. ఈ విధంగా జలమండలికి ఇప్పటికిప్పుడు రావలిన ఆదాయం 10 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు జలమండలి నెలకు 50 కోట్ల రూపాయల విద్యుత్ చార్జీలను చెల్లిస్తోంది. పైగా ఎప్పుడో నిజాం కాలంలో వేసిన పైపులైన్లు పగిలిపోతూ సంస్థకు మరిన్న నష్టాలను కలిగస్తున్నాయి. ఈ నేపధ్యంలో భగ్యనగరానికి ఉచిత మంచినీటి సరఫరా హుళ్లక్కే అన్నట్లుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more