ఢిల్లీలో అపూర్వ విజయం ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ స్థాయిలో కూడా ఆలోచింప జేసింది. మరికొన్ని రాష్ట్రలలోను, 2014 సాధారణ ఎన్నికలలోనూ కూడా ఎన్నికలకు పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్న ఆఆపా జనవరి 26 రిపబ్లిక్ డే కల్లా దేశవ్యాప్తంగా ఒక కోటి మంది సభ్యులు చేరతారని ఆశిస్తున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీలో చేరటానికి రుసుం లేదు. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో తెలియజేసిన ఆఆపా వ్యవస్థాపకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జనవరి 26 కల్లా కోటిమంది సభ్యులు చేరాలని ఆశిస్తున్నామని, ఆ తర్వాత కూడా సభ్యుల చేరిక ఉంటుందని అన్నారు.
అంతకు ముందు పది రూపాయల రుసుం తీసుకుందామని అనుకున్న ఆఆపా దాన్ని రద్దు చేసి ఉచిత సభ్యత్వానికి ప్రకటన చేసింది. దేశంలో మొదటిసారిగా ప్రారంభమైన ఈ విధమైన సభ్యత్వానికి కేవలం సెల్ ఫోన్ ద్వారా తెలియజేస్తే చాలు. పేరు, ఎస్ టి ఢి కోడ్, పార్లమెంట్ నియోజకవర్గం వివరాలు ఇచ్చినట్లయితే వారికి సభ్యత్వ సంఖ్య కేటాయించబడుతుంది. దాన్ని వాళ్ళకి తెలియపరచటం జరుగుతుంది. లేదా ఫోన్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చినా సరిపోతుంది.
ఢిల్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికి మూడు లక్షల మంది ఫోన్ల ద్వారా సభ్యత్వాన్ని కోరారని ఆఆపా నాయకుడు గోపాల్ రాయ్ అన్నారు. ఈ మై భీ ఆమ్ ఆద్మీ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యటం 2014 ఎన్నికల వ్యూహంలోని పెద్ద వాటిలో ఒకటని రాయ్ అన్నారు. దీనితో మాకు ఎంత బలం ఏయే ప్రాంతాలనుంచి వస్తుందన్న అంచనా వేసుకోవటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
సభ్యత్వానికి డయల్ చెయ్యవలసిన ఫోన్ నంబర్- 07798220033
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more