ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పునర్విభజన బిల్లు ముసాయిదాను పంపిన రాష్ట్రపతి దాని మీద శాసన సభ అభిప్రాయాన్ని కోరారని, అంటే దాని అర్థం చర్చ జరగటమేనని వివరించారు.
అందువలన శాసన సభలో చర్చ జరగాలని, అందుకు అందరూ సహకరించాలని కోరుతూ అసెంబ్లీ అభిప్రాయంతోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని అలాగే వోటింగ్ తోనే తెలంగాణా బిల్లు భవిత ఆధారపడివుంటుందని అన్నారు ముఖ్యమంత్రి. వోటింగ్ జరిగిన తర్వాతనే రాష్ట్రపతి ఆ అంశాలను పరిగణనలోకి తీసుకోవటం జరుగుతుంది కాబట్టి శాసన సభలో బిల్లు మీద ప్రతి అంశం మీదా చర్చ జరగటం ముఖ్యమని అన్న ముఖ్యమంత్రి మీడియా అడిగిన ప్రశ్నలకు ఈ క్రింది వివరాలను కూడా ఇచ్చారు.
1. విభజన వలన రెండు రాష్ట్రాలకూ నష్టమే జరుగుతుంది.
2. కాంగ్రెస్ కి ఇక భవిష్యత్తు లేదని అనటం సరైనది కాదని, జనవరి 23 తర్వాత ఈ బిల్లు రాష్ట్రపతికి పంపిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచిస్తాం. దాని గురించి 23 రోజుల ప్రత్యేక సమావేశం జరుగుతుంది.
3. పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ మాటలకు పరిణితి లేదు.
4. విభజన జరిగితే ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు సంవత్సరానికి 60 కోట్ల రూపాయల అవసరం ఉంటుంది.
5. విభజన జరిగితే సంక్షేమ పథకాలకు నిదులుండవు.
6. శ్రీధరబాబు రాజీనామా అందింది.
7. ప్రాణహిత చేవెళ్ళకు 38 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో చిత్తూరుకి 6 వేల కోట్ల రూపాయలు ఇస్తే అది తప్పు అవదు.
8. వందలాది ఫైళ్లు సిఎం కార్యాలయంలో క్లియర్ అవుతూవుంటాయి. వాటి మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు కానీ ఆధారాలు లేకుండా ఆ ఆరోపణలు నిలవవు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more