Nanded bangalore express train catches fire

Nanded-Bangalore express, train catches fire, Anantapur sidt, Nanded-Bangalore express,Fire in Nanded-Bangalore express, 23 people killed, train accident in Andhra Pradesh, 15 people injured

23 people were killed and many injured on Saturday morning when an AC coach of Nanded-Bangalore express caught fire at Anantapuram in AP.

మంటల్లో రైలు - 23 మంది దుర్మరణం

Posted: 12/28/2013 08:02 AM IST
Nanded bangalore express train catches fire

అనంతపురం జిల్లాలో ఈ రోజు తెల్లవారు జామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. నాందేద్-బెంగుళూరు ఎక్స్ ప్రెస్ బి-1 ఏసీ బోగీలో మంటలు చెలరేగి దాదాపు 23 మంది మరణించినట్లు సమాచారం. మరో 15 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. నాందేడ్ నుండి బెంగుళూరు వెళుతున్న ఎక్స్ ప్రెస్ రైలు అనంతపురం జిల్లా కొత్త చెరువు వద్దకు చేరుకోగానే రైల్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.

ఏసీ బోగీలోని వారు ఘాఢ నిద్రలో ఉన్న సమయంలో మంటలు చెలరేగడంతో నిద్ర ఉన్నవారు నిద్రలోనే శాశ్వత లోకాలకు వెళ్లినట్లు చెబుతున్నారు. ప్రమాదంలో బి-1 ఏసీ బోగీ పూర్తిగా దగ్ధమైంది. మరో బోగీ పాక్షికంగా దగ్ధమైంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాని ప్రక్కన ఉన్న మరో భోగికి కూడా మంటలు వ్యాపించడంతో మరికొంత మంది ప్రయాణికులు అందులో చిక్కున్నట్లు సమాచారం.

తీవ్రంగా గాయపడిన ఏడుగురు ప్రయాణికుల్ని చికిత్స నిమిత్తం ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వార్త తెలియగానే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లను తీసుకెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దీనికి సబంధించిన పూర్తి సమాచారం త్వరలో అందిస్తాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles