చారిత్రక లోక్పాల్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. దీంతో అవినీతిని రూపుమాపేందుకు గత 45 ఏళ్లుగా సాగుతున్న సుదీర్ఘ పోరాటంలో ఇదొక ముందడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. లోక్పాల్ బిల్లుపై రాజకీయ పార్టీలు సూచించిన సవరణలపై రాజ్యసభ ఛైర్మన్ హమిద్ అన్సారీ అంతకుముందు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై లోక్సభలో చర్చ జరుగుతుంది. కాగా లోక్పాల్ బిల్లు కోసం నిరశన దీక్షలో వున్న సామాజిక కార్యకర్త అన్నా హజారే బిల్లు ఆమోదం పట్ల హర్షం ప్రకటిం చారు. బిల్లును ఆమోదించినందుకు ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. లోక్సభలో ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడగానే తాను దీక్ష విరమిస్తానని ప్రకటించారు. 2011 డిసెం బరులో సభలో ఆమోదం పొందలేకపోయిన లోక్పాల్, లోకాయుక్త బిల్లు, 2011ను తిరిగి పార్లమెంటరీ సెలక్ట్ కమిటీకి నివేదించారు
అయతే వచ్చే మే నెలలో జరిగే సాధారణ ఎన్నికల్లో కీలక పరీక్షగా ఉన్న అవినీతి వ్యతిరేక ఉద్యమం ఆధారంగా ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను మట్టికరిపించిన ఆమ్ఆద్మీపార్టీ, ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ విజయంతో ఈ బిల్లుకు ఎక్కడలేని మద్దతు వచ్చింది. కేజ్రీవాల్ కాంగ్రెస్ను మూడో స్థానానికి నెట్టేశారు. ఢిల్లీ లో బీజేపీకి మెజారిటీ రాకుండా చేశారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో జాతీయ పార్టీల విజయావకాశాలను దెబ్బ తీసే శక్తి ఉందని కేజ్రీవాల్ నిరూపించారు. మురికి రాజకీయాలను శుభ్రం చేస్తాననే వాగ్ధానంతో కేజ్రీవాల్ ప్రచారం నిర్వహిం చారు.
2011లో ఈ బిల్లు కోసం పోరాడిన క్షేత్రస్థాయి సభ్యుడు కేజ్రీవాల్. దేశవ్యాప్తంగా అన్నా హజారే నేతృత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక పోరాటంలో వెల్లడైన ప్రజాగ్రహాన్ని కాంగ్రెస్ గుర్తించలేకపోయింది. ఈ బిల్లు ఆమోదం కోసం అన్నా హజారే చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మంగళవారానికి ఎనిమిదో రోజుకు చేరింది. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని 2011లో పన్నెండు రోజుల ఆమరణ దీక్ష చేసి ఆయన విజయం సాధించారు. లోక్పాల్బిల్లు పాస్ కావడం పెద్ద ముందడగని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more