Assembly session begins amid protest

apassembly session, assembly, assemblysession begins amid protest, apassembly sessionbegins today, political news, latest telugu news, breaking news, headlines,

Assembly session begins amid Protest

ప్రారంభమైన 'అసెంబ్లీ’ రచ్చ

Posted: 12/12/2013 10:59 AM IST
Assembly session begins amid protest

నగరంలో శీతకాలం అసెంబ్లీ రచ్చ మొదలైంది. కేవలం ఏడు రోజుల పాటు మన రాజకీయ నాయకులు అసెంబ్లీలో రచ్చ రచ్చ చేస్తారు. ఈసారి ప్రాంతల వారిగా నాయకులు రచ్చ చేయటం ఒక విశేషంగా కనబడతుంది. తెలంగాణ కోసం తెలంగాణ ప్రాంత నాయకులు, సమైక్యాంద్ర కోసం సీమాంద్ర నాయకులు ఇలా విడివిడిగా రాజకీయ నాయకులు శీతకాలం అసెంబ్లీ సమావేశాల్లో రాజకీయ వేడి రగిలిస్తారు. ఈరోజు ముందుగా సమైక్య, తెలంగాణ నినాదాలు..నిరసనలతో శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే టిడిపి, టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.

 

కొంత సమయం ప్రాంత నేతల నినాదాలతో సభ దద్ధరిల్లింది. అనంతరం దక్షిణాఫ్రికా నాయకుడు నెల్సన్ మండేలాకు సిఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు, టిఆర్ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్, వైసిపి తరపున విజయలక్ష్మి నివాళులర్పించారు. మండేలా కుటుంబసభ్యులకు సానుభూతి తెలుపుతున్నామని, సభ తరపున ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నామని సిఎం కిరణ్ అన్నారు.

 

గాంధీజీ తనకు ఆదర్శం అని పోరాట యోధుడు మండేలా చెప్పడం మన దేశానికి గర్వకారణం అని చంద్రబాబు నాయుడు తెలిపారు. నెల్సన్ మండేలా పోరాట స్ఫూర్తి శాశ్వతంగా నిలిచిపోతుందని..తరతరాలకు మార్గదర్శకం అవుతుందని కెటిఆర్ పేర్కొన్నారు. మండేలా జీవితమే ఓ సందేశం అని విజయలక్ష్మి అన్నారు

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles