ఒకరు కాదు, ఇద్దరు కాదు ..ఏకంగా 34 మంది ప్రయాణికులు విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానం కనిపించకుండా మాయమైంది. నిత్యం మనం రోడ్డు మీద అనేక ప్రమాదాలు చూస్తుంటాం, అవి మన కళ్లముందే జరుగుతాయి కాబట్టి ఆ ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే సహయ చర్యలు అందిస్తారు. కానీ ఆకాశంలో మాయమైన ప్రయాణికుల సంగతి ఏమిటి. అసలు విషయం ఏమిటంటే.మొజాంబిక్ నుంచి అంగోలా వెళ్లున్న మొజాంబిక్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం అదృశ్యమైంది. ఆ విమానంలో 28 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారని తెలిపింది.
విమానం టీఎం 470 నిన్న సాయంత్రం 3.00 గంటల సమయంలో మోపాటొలో టెక్ ఆఫ్ అయింది. అనంతరం సాయంత్రం 6.40 నిమిషాలకు అంగోలా రాజధాని లువాండ చేరుకోవాల్సి ఉందని తెలిపింది. అయితే ఆ లోపు విమానం అదృశ్యమైందని వెల్లడించింది. ఉత్తర నమీబియా ప్రాంతంలో చిట్టచివరగా ఆ విమాన పైలెట్లతో మాట్లాడినట్లు విమానయాన అధికారులు వెల్లడించారు. విమానం ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసు కమాండర్ చెప్పారు.
అయితే రాత్రి కావడంతో గాలింపు చర్యలు అపివేశామని చెప్పారు. ఉదయం నుంచి గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు ఆయన వివరించారు. అయితే విషయం తెలుసుకున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారికి ఏమైందోనని, అధికారులు, కుటుంబం సభ్యులు ఆందోళ చెందుతున్నారు. అయితే గాలింపు చర్యలు వేగవంతం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more