Cm kiran rachabanda program postponed

CM Kiran Rachabanda Program Postponed, Medak District Rachabanda Postponed, mla jagga reddy, congress party, trs party, telangana place, cm kiran kumar reddy and jagga reddy,

CM Kiran Rachabanda Program Postponed

రచ్చ బండ వాయిదా- ఇబ్బందిపడ్డా టీ-రెడ్డిగారు

Posted: 11/12/2013 03:58 PM IST
Cm kiran rachabanda program postponed

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు మెదక్ జిల్లాలో తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ఇంకా నిర్ణయించలేదు. మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, గీతా రెడ్డిలు కిరణ్ కుమార్ రెడ్డిని మంగళవారం మధ్యాహ్నం కలిశారు. రేపు తమకు కృతజ్ఞతా సమావేశం ఉన్నందున రచ్చబండ కార్యక్రమానికి రాలేమని కిరణ్‌తో చెప్పారు. వాయిదా వేయాలని కోరారు. దానికి ముఖ్యమంత్రి అంగీకరించారు.

 

కిరణ్‌తో భేటీ అనంతరం సునీతా, గీతా రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చినందున తాము సమావేశాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా రేపు సభలో పాల్గొనాల్సి ఉందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పి రచ్చబండను వాయిదా వేయాలని కోరామని, అందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. కాగా ఈ నెల 16, 17 తేదీల్లో సీమాంధ్రలో రచ్చబండ కార్యక్రమం ఉంది.

 

రెడ్డి గారు ఇబ్బంది పడ్డారు

 

సంగారెడ్డికి ముఖ్యమంత్రికి రానివ్వకుండా అడ్డుకోవడం ద్వారా సంగారెడ్డి ప్రజలకు తీవ్ర నష్టం చేశారని విప్ జగ్గారెడ్డి అన్నారు. జెఎసిలకు, టిఆర్ఎస్ కు తమ ప్రాంతంలో కిరణ్ అడ్డుకునే దమ్ము లేదని ,కాకపోతే జిల్లా మంత్రులు వాయిదా వేసుకోవాలని కోరారని ,అందువల్ల నే వాయిదా వేసుకున్నారని ఆయన అన్నారు.

 

ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ సభ ఉంది కనుక వాయిదా కోరారని అన్నారు. సంగారెడ్డికి ముఖ్యమంత్రి వచ్చి ఉంటే రెండువందల కోట్ల మేర లాభం జరిగి ఉండేదని జగ్గారెడ్డి అన్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కూడా కిరణ్ పర్యటనను వ్యతిరేకించలేదని సమర్ధించుకోవడానికి జగ్గారెడ్డి ప్రయత్నించారు.కిరణ్ పర్యటన రద్దు కావడంతో జగ్గారెడ్డి ఇబ్బంది పడుతున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles