ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఈరోజు మెదక్ జిల్లాలో తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ఇంకా నిర్ణయించలేదు. మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, గీతా రెడ్డిలు కిరణ్ కుమార్ రెడ్డిని మంగళవారం మధ్యాహ్నం కలిశారు. రేపు తమకు కృతజ్ఞతా సమావేశం ఉన్నందున రచ్చబండ కార్యక్రమానికి రాలేమని కిరణ్తో చెప్పారు. వాయిదా వేయాలని కోరారు. దానికి ముఖ్యమంత్రి అంగీకరించారు.
కిరణ్తో భేటీ అనంతరం సునీతా, గీతా రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చినందున తాము సమావేశాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా రేపు సభలో పాల్గొనాల్సి ఉందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పి రచ్చబండను వాయిదా వేయాలని కోరామని, అందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. కాగా ఈ నెల 16, 17 తేదీల్లో సీమాంధ్రలో రచ్చబండ కార్యక్రమం ఉంది.
రెడ్డి గారు ఇబ్బంది పడ్డారు
సంగారెడ్డికి ముఖ్యమంత్రికి రానివ్వకుండా అడ్డుకోవడం ద్వారా సంగారెడ్డి ప్రజలకు తీవ్ర నష్టం చేశారని విప్ జగ్గారెడ్డి అన్నారు. జెఎసిలకు, టిఆర్ఎస్ కు తమ ప్రాంతంలో కిరణ్ అడ్డుకునే దమ్ము లేదని ,కాకపోతే జిల్లా మంత్రులు వాయిదా వేసుకోవాలని కోరారని ,అందువల్ల నే వాయిదా వేసుకున్నారని ఆయన అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ సభ ఉంది కనుక వాయిదా కోరారని అన్నారు. సంగారెడ్డికి ముఖ్యమంత్రి వచ్చి ఉంటే రెండువందల కోట్ల మేర లాభం జరిగి ఉండేదని జగ్గారెడ్డి అన్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కూడా కిరణ్ పర్యటనను వ్యతిరేకించలేదని సమర్ధించుకోవడానికి జగ్గారెడ్డి ప్రయత్నించారు.కిరణ్ పర్యటన రద్దు కావడంతో జగ్గారెడ్డి ఇబ్బంది పడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more