ప్రస్తుతం వెండీస్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ ను సచిన్ ఫేర్ వెల్ టెస్టు సిరీస్ గా పేర్కొంటుండటంతో ఈ సిరీస్ కి అంత్యంత ప్రాధాన్యత ఏర్పడిన విషయం తెలిసిందే. మొదటి రోజు బౌలర్లు బెంబేలెత్తి మురిపించిన టీం ఇండియా ఆటగాళ్ళు బ్యాటింగులో మాత్రం చేతు లెత్తేశారు. ఎంతో ఆశగా సచిన్ బాంటింగ్ కోసం చూస్తున్న అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింగి.
రెండో రోజు ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన టీం ఇండియా 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో సచిన్ అలరిస్తాడనుకుంటే ఇలా చుట్టపు చూపుగా వచ్చి అలా వెళ్ళాడు. భారీ స్కోరు ఆశించక పోయినా ఎక్కువ సేపు క్రీజులో ఉంటాడనుకుంటే కేవలం 24 బంతులు మాత్రమే ఆడి పెవిలియన్ కి చేరి కూర్చున్నాడు. 24 బంతులు ఆడిన సచిన్ రెండు ఫోర్లతో 10 పరుగులు మాత్రమే చేశాడు. సచిన్కు ముందు చటేశ్వర పూజారా, సచిన్ తర్వాత యువ సంచలనం విరాట్ కోహ్లి మూడు పరుగలకే ఔటయ్యాడు.
దాంతో 87 పరుగులకే ఇండియా సగం టీమ్ను కోల్పోయింది. భారత్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం కెప్టెన్ ధోని, రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు. ఇప్పటికే టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ ను కొల్పోయిన టీం ఇండియా కోలుకోవాలంటే కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. విండీస్ బౌలర్ ఫోర్డ్ మూడు వికెట్లు తీసి సత్తా చాటి భారత్ నడ్డి విరిచాడు. ఆట ప్రారంభం అయిన గంటన్నరలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. అభిమానులు ఇంకా స్టేడియంలోకి రాకముందే వీరు వెళ్ళి పెవీలియన్ లో కూర్చున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more