రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఏడు కొండల వెంకన్న సాక్షిగా కోరుకున్నపీసీసీ అద్యక్షుడు బొత్స సత్యనారాయణ. ఇప్పుడు రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉన్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకు నిదర్శనం ఆయన ఈరోజు చేసిన ప్రకటనే కారణమని సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. జీవోఎంకు అన్ని రాజకీయ పార్టీల నివేదికలను పంపిన బొత్స. తెలంగాణ బిల్లు పై దుష్టిపెట్టినట్లు సమాచారం.
తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందని బొత్స సత్యనారాయణ తెలిపారు. తీర్మానాన్ని కూడా పంపించాలని కోరినట్టు వెల్లడించారు. రెండు ప్రాంతాల నాయకుల అభిప్రాయాలను గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తెలంగాణపై తమ పార్టీ మొదటి నుంచి క్లారిటీతో ఉందన్నారు. పీసీసీ చీఫ్ గా సీడబ్ల్యూసీ తీర్మానాన్ని గౌరవిస్తానని చెప్పారు. రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలు యూటర్న్ తీసుకున్నాయని అన్నారు.
బొత్స ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటంలేదని.. సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తలలుపట్టుకుంటున్నారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తే.. బిల్లు ఓడిపోవటం ఖాయమనే విషయం అందరికి తెలుసు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ తెలంగాణ బిల్లును అసెంబ్లీకి తెస్తానని చెప్పటంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు షాక్ తిన్నారు.
అసలు బొత్సకు సమైక్యాంద్రకు మద్దతు తెలుపుతున్నాడా? లేక రాష్ట్ర విభజన కు మద్దతు తెలుపుతున్నాడో అర్థం కావటం లేదని సీమాంద్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సత్తిబాబు తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బొత్సకు ఇచ్చిన 100 పేజీల నివేదికను.. జీవోఎంకు కూడా పంపించి.. బొత్సకు ఎలాంటి తలభారం లేకుండ చేయటం జరిగింది. కానీ సత్తిబాబు సడన్ గా తెలంగాణ బిల్లు పై ద్రుష్టిపెట్టడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more