Konda surekha comment on jagan samaikya sankharavam

konda surekha comment on jagan samaikya sankharavam, Samaikya Sankharavam, Konda Surekha Sensational Comments on YS Jagan, Konda Surekha

konda surekha comment on jagan samaikya sankharavam

జగన్ సభ పై కొండా సురేఖ ఫైర్

Posted: 10/24/2013 06:57 PM IST
Konda surekha comment on jagan samaikya sankharavam

మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ గురించి తెలియాని వారు ఎవరు ఉండారు. వైఎస్ కుటుంబంతో కొండా సురేఖకు మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర విభజన ప్రకటనతో.. వైఎస్ ..కొండాల మద్య సంబంధం తెగిపోయింది. ఆనాటి నుండి కొండా ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్ ను ఉతికిపారేస్తుంది. కాంగ్రెస్ లో కలిసిపోయిన కొండా సురేఖ తన సత్తా చాటుకోవటానికి రెఢీ అవుతుంది. ఇప్పుడు కొండా సురేఖ టార్గెట్ వైఎస్ జగనే.

 

ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొండా దంపతులు భేటీ అయ్యారు. అనంతరం కొండా సురేఖ వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమైక్య శంఖారావం పేరిట హైదరాబాద్ లో వైకాపా తలపెట్టిన బహిరంగసభ కేవలం తెలంగాణ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేందుకేనని కొండా సురేఖ అన్నారు. దీనికి తెలంగాణ ప్రజలు ఏ మాత్రం రెచ్చిపోరాని, వారి ప్రత్యేక రాష్ట్రం కల నెరవేరుతున్న తరుణలో ఇటువంటివి పట్టించుకోరన్నారు. సోనియా నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చురుగ్గా సాగుతోందని కొండా సురేఖ అన్నారు. కిరణ్ వ్యక్తి గతంగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతున్నారన్నారు. ఇప్పుడు సీమాంద్ర ప్రజలు పడుతున్న వేదన, కొన్నేళ్లుగా తెలంగాణ ప్రజలు అనుభవించారని ఆమె పేర్కొన్నారు.

 

అయిన కొండా దంపతులు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో , ఎవరికి అర్థం కావటంలేదు. జగన్ సమైక్యానికి జై అంటే నచ్చని కొండా దంపతులు.. కాంగ్రెస్ లో మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాది అని తెలిసి కూడా కాంగ్రెస్ లో కొనసాగుతున్నరంటే.. ప్రతిఒక్కరికి ఆశ్చర్యం కలుగుతుంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles