ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకోనుందా? దీన్నీ ఓ శాఖగా గుర్తించనుందా? ఈ దిశగా కార్మిక సంఘాలు చేసిన ఒత్తిళ్లపై ప్రభుత్వం తలొగ్గిందా?.. ఈ ప్రశ్నలన్నింటికీ సానుకూల సమాధానమే వినిపిస్తోంది. రూ.5 వేల కోట్ల మేర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని విలీనం చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా... ఆర్టీసీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, అప్పులు, సంస్థకు వచ్చే రోజువారీ ఆదాయం, నష్టాలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఓ ఉన్నతస్థాయి కమిటీని వేసింది.
ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డీ లక్ష్మీ పార్థసారథి జీవో (నంబర్ 954) జారీ చేశారు. ఈ కమిటీ వందరోజుల్లో తన నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 72 రోజు లుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు రెండురోజుల్లో తెరపడే అవకాశం ఉంది. ఈరోజు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు బస్భవన్లో మరోసారి రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం ఆర్టీసీ సమ్మె విర మణపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్పై సమ్మె చేస్తోన్న ఏపీఎన్జీవోలకు మద్దతుగా ఆర్టీసీ కార్మిక సంఘం కూడా మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఆగస్టు 12వ తేదీ నుంచి నిరవధిక సమ్మె కు దిగిన ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘమైన ఎంప్లాయిస్ యూనియన్ సీమాంధ్ర పోరాట కమిటీ నేతలు.. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసుకోవా లన్న డిమాండ్నూ ప్రభుత్వం ముందుంచారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రివర్గ ఉపసంఘం సమక్షంలో వేర్వేరుగా పలుమార్లు జరిగిన చర్చల్లో ఎలాంటి హామీ రాలేదు. ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్పై ముఖ్యమంత్రి, రవాణా మంత్రి సానుకూలంగా స్పందించడమే కాకుండా.. ఆర్థిక అంశాలపై అధ్యయనం చేయడానికి ఉన్నతాధికారుల కమిటీని కూడా వేశారు. సాయంకాలానికే జీవో కూడా వెలువడింది. దీనిపై ఎంప్లాయిస్ యూనియన్ నేతలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఈరోజు మరోసారి భేటీ అయిన అనంతరం సమ్మె విరమణ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more