Seemandhra staff agitations at digvijay s house in delhi

seemandhra staff Agitations at Digvijay s House in Delhi, Seemandhra Employees Agitations at Digvijay, samaikyandhra

seemandhra staff Agitations at Digvijay s House in Delhi, Seemandhra Employees Agitations at Digvijay

ఢిల్లీలో డీగ్గీరాజను తాకిన సమైక్య సెగ

Posted: 08/29/2013 09:46 AM IST
Seemandhra staff agitations at digvijay s house in delhi

సమైక్య సెగ దేశ రాజధానిని తాకింది. సీమాంధ్ర ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దిగ్విజయ్ సింగ్ నివాసం ఎదుట ఆందోళన నిర్వహించారు. సమైక్యాంధ్ర కావాలంటూ నినాదాలు చేశారు. దిగ్విజయ్ సింగ్ ను కలిసిన అనంతరం సీమాంధ్ర ఉద్యోగులు మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను దిగ్విజయ్‌కు వివరించినట్లు వారు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేమని, అయితే సీమాంధ్రులకు అన్యాయం జరగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర విభజన చేయడమంటే ఎపి మ్యాప్ లో అడ్డంగా గీత గీసినట్లు కాదని సీమాంధ్ర ఉద్యోగులు చెప్పారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడం అన్యాయమని అన్నారు. ఏక పక్ష నిర్ణయంతో రాష్ట్రాన్ని విభజించడం అన్యాయమని అన్నారు. సిడబ్ల్యుసి తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం సీమాంధ్రలో అన్ని రంగాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. సమైక్యరాష్ట్ర ఉద్యమం ప్రజల నుంచి వచ్చిందని చెప్పారు. సమైక్యంగా ఉంటే మూడుప్రాంతాలు లాభపడతాయని, విడిపోతే నష్టపోతాయని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles