పార్లమెంటులో గందరగోళం సృష్టించి సభను సజావుగా సాగనివ్వని తెలుగుదేశం పార్టీ సభ్యులు నలుగురు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏడుగురు సస్పెన్డ్ చెయ్యటానికి ప్రతిపాదన చేయటం జరిగింది.
స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్ళి నిరసనలను వ్యక్తం చెయ్యటమే కాక ఒక సందర్భంలో స్పీకర్ మైక్ ని కూడా లాగేసే ప్రయత్నం జరిగింది. అయితే వారితోపాటుగా తమ స్థానాల్లో ఉండే నిరసన వ్యక్తపరచిన కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కూడా సస్పెన్షన్ జాబితాలో ఉండటం విశేషం.
ఈ 11 మందినీ పార్లమెంటు సమావేశాలు పూర్తయేంతవరకు అంటే 30వ తేదీ వరకు సస్పెన్షన్ లో ఉంచేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమలనాథ్ పార్లమెంటులో ప్రతిపాదన పెట్టారు. అందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ సి పి మినహాయించి మిగిలిన అన్ని పార్టీలూ అభ్యంతరాన్ని వ్యక్తపరచాయి.
ఈ సందర్భంలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ, తాము తెలంగాణాకి అనుకూలమే కానీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల సస్పెన్షన్ ని వ్యతిరేకిస్తున్నామన్నారు. తాము లోగడ మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసామని, కానీ ఇంత గందరగోళ పరిస్థితి ఎప్పుడూ ఏర్పడలేదని భాజపా నేతలు అన్నారు.
సస్పెన్షన్ ప్రతిపాదనలో ఉన్ననలుగురు తెలుగుదేశం పార్టీ సభ్యులు- మోదుగుల వేణుగోపాల రెడ్డి, కొనకళ్ళ నారాయణ, శివప్రసాద్, నిమ్మల కృష్ణప్ప,
సస్పెన్షన్ ప్రతిపాదనలో ఉన్న ఏడుగురు కాంగ్రెస్ పార్టీ సభ్యులు- లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకటరామరెడ్డి, సాయిప్రతాప్.
సభను గందరగోళ పరిస్థితుల్లో 45 నిమిషాల సేపు వాయిదా వేసిన స్పీకర్ ఆ తర్వాత కూడా సీమాంధ్ర నాయకుల హోరుతో పాటు సస్పెన్షన్ ప్రతిపాదన మీద కూడా నిరసనలు తగ్గకపోయేసరికి సభను రేపటికి వాయిదా వేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more