రాష్ట్రంలో తుది విజత పంచాయితీ ఎన్నికలు ఈ రోజు ఒంటిగంటకు ముగిసాయి.
పోయిన రెండుసార్లు చేసినట్లుగానే ఒంటిగంట వరకు క్యూలో చేరిన ఓటర్లను ఓటు వెయ్యటానికి అనుమతించమని రాష్ట్ర ఎన్నికల అధికారి నవీన్ మిట్లల్ ఆదేశాలను పాటిస్తున్నారు.
చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందంటూ అధికారులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే ఓట్ల లెక్కింపు ఈ రోజు సాయంత్రం వరకు పూర్తై ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
భారీ వర్షాల వలన కొన్ని పంచాయతీల్లోని ఓటర్లు పోలింగ్ స్టేషన్ కి చేరుకోవటం కష్టమైంది. గుంటూరు జిల్లాలోని పెద్ద రెడ్డిపాలెంలో ఓటర్లు బ్యాలెట్ బాక్స్ లను ఎత్తుకెళ్ళి బావిలో పడవేయగా పోలీసులు అడ్డుకోజూసారు. దానితో వాళ్ళ మీద ఓటర్లు దాడిచేసారు. పోలింగ్ కేంద్రం మీద రాళ్ళను కూడా విసిరారు. దానితో ఎస్ ఐ భుజంగరావు గాయపడి స్పృహతప్పారు. నల్గొండ జిల్లాలో కొన్ని పంచాయితీలలో కాంగ్రెస్, తెదేపా నాయకుల మధ్య తోపులాటలు జరిగాయి. ఇవి మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లేనని అధికారులు అన్నారు.
తుది విడత పోలింగ్ 64.1 శాతం జరిగిందని, అధికంగా ప్రకాశం జిల్లాలో 76.7 శాతం ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారని, కనిష్టంగా మహబూబ్ నగర్ జిల్లాలో 51.8 శాతం మాత్రమే ఉపయోగించుకున్నారని అధికార లెక్కలు తెలియజేస్తున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more