Mim president asaduddin owaisi supports for rayala telangana state

mim president asaduddin owaisi, asaduddin owaisi supports for rayala-telangana state, rayala-telangana state, sonia gandhi , manmohan singh, breaking news, ap politics, political news, andhra news

MIM president Asaduddin Owaisi supports for Rayala-Telangana state

అసదుద్దీన్ ఓవైసీ లేఖతోనే అమ్మ మనస్సు మారిందా

Posted: 07/28/2013 09:51 AM IST
Mim president asaduddin owaisi supports for rayala telangana state

ఢిల్లీలో అమ్మ మనసును మార్చింది మన హైదరాబాద్ నాయకుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అని వార్తలు వినిపిస్తున్నాయి. రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే ఎన్నికలు ఎప్పుడు జరిగినా 52 అసెంబ్లీ స్థానాల్లో యుపిఎ భాగస్వామ్య పక్షాలు విజయం సాధించవచ్చని అసదుద్దీన్ ఓవైసీ లేఖలో రాసినట్లు తెలుస్తోంది. అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఇటీవల రాసిన లేఖనే విభజన విషయంలో కీలకంగా మారినట్లు చెబుతున్నారు. మొత్తం విభజన అంశాన్ని అది మలుపు తిప్పిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. పది జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ ఇస్తే యూపీఏకు కలిగే ప్రయోజనాలు, రాయలసీమలోని రెండు జిల్లాలను కలుపుతూ రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే ఒనగూరే ప్రయోజనాలను ఆయన ఈ లేఖలో వివరించినట్లు తెలుస్తోంది. రాయల తెలంగాణ ప్రాంతంలో మైనార్టీలు, దళితులు, రెడ్డి సామాజిక వర్గాల ప్రాబల్యం ఎలా ఉందనే విషయాన్ని ఆయన గణాంకాల్లో పొందు పరిచినట్లు సమాచారం. భవిష్యత్తులో కూడా తెలంగాణలో బిజెపి బలపడకుండా చూడవచ్చని ఆయన అందులో చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా రాయల తెలంగాణ ఏర్పాటుకు అసక్తి చూపడానికి అసద్ లేఖ ప్రభావం ఉందనే ప్రచారం సాగుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తూ రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనకు మజ్లీస్ పార్టీ పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles