Ysrcp leaders attack on s i

ysrcp leaders attack on SI, Karnool dist, S.I. Ramesh

ysrcp leaders attack on SI, Karnool dist, S.I. Ramesh

ఎస్సై ని చితకబాదిన వైసీపీ నేతలు

Posted: 07/16/2013 08:05 PM IST
Ysrcp leaders attack on s i

కడప జిల్లాలో వైయస్సార్ సీపీ నాయకుల దౌర్జన్యానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా జిల్లాలోని లింగాల మండలం అంబకపల్లెకు చెందిన వైయస్సార్ సీడీ కార్యకర్తలు ఎస్.ఐ రమేష్ బాబు పై దాడికి దిగారు. గ్రామంలో మద్యం తాగి ఓ వ్యక్తి చనిపోయాడన్న సమాచారంతో ఆ గ్రామంలోకి వెళ్లిన ఎస్సైతో వైయస్ఆర్ సీపీ నేత మురళీనాథ్ రెడ్డీ వాగ్వాదానికి దిగారు. ఎస్సైకి వైకాపా కార్యకర్తల తోపులాట జరిగింది. దీంతో ఆగ్రహించిన వైకాపా కార్యకర్తలు ఎస్సైని చితకబాదారు. ఈ దాడిలో ఎస్సై రమేష్ బాబు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన్ని పులివెందుల ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం ఎస్సై రమేష్ బాబు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది. గాయపడిన ఎస్సైని జిల్లా ఎస్పీ మనీష్ పరామర్శించారు. అయితే వైకాపా కార్యకర్తల దౌర్జన్యం రోజు రోజుకు పెరిగిపోతుందని అక్కడి వారు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles