బోఫోర్స్ కేసులో ప్రధాన నిందితుడు, వ్యాపారవేత్త ఒట్టావియో ఖత్రోచి (74) ఇటలీ లోని మిలాన్ నగరంలో శుక్రవారం నాడు మరణించారు.
1986లో భారత రక్షణ శాఖ రూ.1437 కోట్ల రూపాయలు వెచ్చించి చేసిన హోవిట్జర్ శతఘ్నుల కొనుగోళ్ళలో ముడుపులు అందాయన్న విషయం బయటపడటంతో కాంగ్రెస్ పార్టీకి అది ఒక పెద్ద మచ్చలాగా తయారై రాజకీయరంగంలో ఒక అడ్డంకిగానూ, ప్రతిపక్షాలకో ఆయుధంగానూ తయారైంది.
హోవిట్జర్ శతఘ్నులను భారత్ కి అమ్మిన బోఫోర్స్ కంపెనీ ఆ ఒప్పందం కోసం భారత్ లో ఖత్రోచి ద్వారా ముడుపులు అందజేసిందన్న ఆరోపణ మీద సిబిఐ దర్యాప్తు చేపట్టింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అతని కుటుంబ సభ్యులకు సన్నిహితుడైన ఖత్రోచి ద్వారా రాజీవ్ గాంధీ కి లంచం అందిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. వాటి మీద తన దగ్గర ఆధారాలున్నాయంటూ ఆ తర్వాత ప్రధానమంత్రి గా పనిచేసిన విశ్వనాథ ప్రతాప్ సింగ్ కూడా ప్రకటించారు. మొత్తానికి కాంగ్రెస్ ని బాగా ఇరకాటంలో పెట్టిన బోఫోర్స్ కేసులో రాజీవ్ గాంధీ లేరు, ఇప్పుడు ప్రధాన నిందితుడైన ఖత్రోచి కూడా శుక్రవారం మరణించారు.
సిబిఐ దర్యప్తు ముమ్మరంగా సాగుతుండగా 1993 లో భారతదేశం నుండి విదేశాలకు జారుకున్న ఖత్రోచి భారత్ లో అరెస్ట్ ను తప్పించుకున్నారు. ఆ తర్వాత వివిధ దేశాలలో తలదాచుకున్నారు. సిబిఐ ఆయనను పట్టుకోలేకపోయింది. అయితే పట్టుకోలేక పోవటం కాదని, ఖత్రోచి ఏ దేశాలలో ఉన్నారో ఆ దేశాలకు సరైన విధంగా అభ్యర్థనను పంపించకపోవటం కేసు దర్యాప్తును కావాలనే తాత్సారం చేసారంటూ సిబిఐ మీద ఆరోపణలు కూడా వచ్చాయి. మొత్తానికి ఇప్పుడు బోఫోర్స్ కి పూర్తిగా తెరపడింది.
అయితే విచిత్రమేమిటఁటే, కేసులో ఏమీ తేలలేదు, ఎవరినీ పట్టుకోలేదు ఎటువంటి డబ్బునూ వెనక్కి రప్పించుకోలేదు కానీ 64 కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పుకున్న కేసు పరిశోధనకు మాత్రం 250 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి
ఖత్రోచి అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more